బాలయ్యతో అఖండ అంటూ మరో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు బోయపాటి శ్రీను. బాలయ్యతో సినిమా చేస్తే అది బోయపాటి మాత్రమే చేయాలి అన్న విధంగా అఖండ గర్జన ఉంది. బాలకృష్ణ కెరియర్ లో ఆ సినిమా ది బెస్ట్ హిట్ గా నిలిచింది. అఖండ తర్వాత ఆ సినిమా సీక్వెల్ కి కూడా స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారట బోయపాటి. అయితే బాలకృష్ణ గోపీచంద్ మలినేని సినిమా పూర్తి అయ్యే లోగా వేరే హీరోతో సినిమా చేయాలని చూస్తున్నారు బోయపాటి శ్రీను.

ఫిల్మ్ నగర్ టాక్ ప్రకారం బోయపాటి శ్రీను తన నెక్స్ట్ సినిమా ఉస్తాద్ రామ్ తో చేస్తారని అంటున్నారు. రామ్ ప్రస్తుతం లింగుసామి డైరక్షన్ లో ది వారియర్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత వెంటనే బోయపాటి శ్రీను సినిమా ఉంటుందని అంటున్నారు. ఇక ఈ సినిమా కోసం బోయపాటి శ్రీను కి 12 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని టాక్. మాములుగా అయితే సినిమాకు 8 నుండి 9 కోట్ల దాకా తీసుకునే బోయపాటి శ్రీను అఖండ హిట్ తర్వాత 12 కోట్లు డిమాండ్ చేస్తున్నారన్ తెలుస్తుంది.  

రామ్ సినిమాకు 12 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట. రాం తర్వాత అఖండ 2 ఉంటుందని టాక్. మొత్తానికి టాలీవుడ్ స్టార్ డైరక్టర్స్ లో ఇన్నాళ్లు బోయపాటి శ్రీను మాత్రమే రెమ్యునరేషన్ తక్కువ తీసుకుంటాడని అనుకుంటుంటే ఆయన కూడా ఇప్పుడు 12 కోట్ల దాకా ఛార్జ్ చేస్తున్నారని తెలుస్తుంది. రామ్ సినిమా హిట్ పడితే 12 కాదు 15 కోట్లు తీసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని చెప్పొచ్చు. అయితే ఆయనకు ఎంత ఇచ్చినా సరే దానికి తగిన సినిమా మాత్రం ప్రేక్షకులకు అందిస్తారని చెప్పొచ్చు. తెలుగులో ఉన్న స్టార్ డైరక్టర్స్ కు ఈక్వల్ గా సినిమాల సక్సెస్ లతోనే కాదు రెమ్యునరేషన్ లో కూడా పోటీ పడుతున్నారు బోయపాటి శ్రీను.  


మరింత సమాచారం తెలుసుకోండి: