టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం భారీ ఫ్యాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా హీరో నటిస్తున్న 'రాధేశ్యామ్' సినిమా మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ కి జోడీగా పూజ హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా తర్వాత బాలీవుడ్ దర్శకుడు ఓం రావుత్ దర్శకత్వంలో ప్రభాస్ 'ఆదిపురుష్' అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై టాలీవుడ్, బాలీవుడ్ తో పాటు మిగతా ఇండస్ట్రీలో కూడా భారీ అంచనాలున్నాయి. 

అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్ కి ఉన్న క్రేజ్ ని క్యాష్ చేసుకోవడానికి ఈ సినిమా నిర్మాతలు ఈ సినిమాని భారీ ఎత్తున విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సాహో సినిమా పాన్ ఇండియా మూవీ గా విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రభాస్ నటించిన ఆది పురుష్ మాత్రం పాన్ ఇండియా ని దాటేసి పాన్ వరల్డ్ సినిమాగా పేరు దక్కించుకుంటోంది. దాదాపు నాలుగు వందల కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాని ఒకే సమయంలో 15 జాతీయ మరియు అంతర్జాతీయ భాషల్లో విడుదల చేయబోతున్నారు మేకర్స్. ఇక సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడు.

ఆయన సరసన సీతగా కృతి సనన్ అలాగే రావణాసురుడిగా బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ నటిస్తున్నాడు. గ్రాఫిక్స్, విజువల్స్ కి అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన ఈ సినిమా ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఒకే ఒక్క సీన్ కోసం భారీగా ఖర్చు చేశారట మేకర్స్. ముఖ్యంగా ఈ సినిమాలో ఓ కీలక సన్నివేశం కోసం నిర్మాతలు ఏకంగా 60 కోట్లు ఖర్చు చేశారని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఇది ఇండస్ట్రీలోనే టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఒక్క సీన్ కోసమే ఇంత ఖర్చు చేశారు అంటే ఈ సినిమా ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు. మరి సినిమాలో 60 కోట్లు ఖర్చు చేసిన ఆ సీన్ ఎలా ఉంటుందో చూడాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే...!!

మరింత సమాచారం తెలుసుకోండి: