గత కొన్ని రోజుల నుంచి సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదాలు అభిమానులను  శోకసంద్రంలో ముంచేస్తూ ఉన్నాయి. ఎంతో మంది సినీ ప్రముఖులు అనారోగ్యం బారిన పడుతూ ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. దీంతో చిత్ర పరిశ్రమ మొత్తం తీవ్ర దిగ్భ్రాంతిలో మునిగిపోతుంది. ఇటీవలే లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ మృతి చెందడంతో భారతీయ చలన చిత్ర పరిశ్రమ మొత్తం దిగ్భ్రాంతిలో మునిగిపోయింది. ఈ బాధ నుంచి తేరుకునేలోపే ఇటీవలే మరో లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ బిప్పి లహరి కరోనా వైరస్ తో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు. దీంతో ఇక ఇంత గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ ను కోల్పోవడం సినీ పరిశ్రమకు తీరని లోటు అంటూ ఎంతో మంది సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.


 ఈ విషాదం నుంచి కోలుకోకముందే ఇక ఇప్పుడు మరో  ఘటన జరిగింది. తమిళ చిత్ర పరిశ్రమలో నటుడిగా కమెడియన్గా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న ప్రదీప్ కొట్టాయం ఇటీవలే గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. తన కామెడీ టైమింగ్ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ప్రదీప్ కొట్టాయం ఇప్పుడు వరకు ఎన్నో సినిమాల్లో నటించారు. 2001లో ఆయన కెరీర్ ప్రారంభించారు.  అంతకు ముందు ఎల్ఐసి ఆఫీసర్గా పని చేసేవారు. ఇక తెలుగులో నాగచైతన్య సమంత నటించిన ఏ మాయ చేసావే సినిమా లో కేరళలో ఉండే అంకుల్ పాత్రలో నటించాడు.



 కాగా మాయ అనే మహిళను పెళ్లి చేసుకున్నారు ప్రదీప్ కొట్టాయం. ఆయనకు విష్ణు శివ, బ్రిండా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే వరుస అవకాశాలు అందుకుంటూ తమిళ చిత్ర పరిశ్రమలో దూసుకుపోతున్న ప్రదీప్ కొట్టాయం అకస్మాత్తుగా గుండెపోటు తో మరణించటంతో  అభిమానులు అందరూ కూడాశోకసంద్రంలో మునిగిపోయారు. ఇక ప్రదీప్ కొట్టాయం మృతిపై ఎంతో మంది సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తూ ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: