కీర్తి
సురేష్ హీరోయిన్ గా ఇప్పుడిప్పుడే
సక్సెస్ బాట పడుతుంది. మహేష్ బాబు సరసన
హీరోయిన్ గా నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ తొలుత టాప్
హీరోయిన్ అయ్యే విధంగా ప్రేక్షకులను మెప్పించింది. ఆమె నటించిన
నేను శైలజ సినిమా ఈమెకు మంచి గుర్తింపు తీసుకు రాగా అందులో ఆమె నటించిన తీరుకు తొందరలోనే ఈమె టాప్
హీరోయిన్ కావడం ఖాయం అని అందరూ అనుకున్నారు. అలా ఆమె వరుస సూపర్ హిట్ సినిమాల్లో నటించిన తరువాత
మహానటి సినిమా దేశ వ్యాప్తంగా క్రేజ్ తీసుకొచ్చింది.
ఈ
సినిమా లో ఆమె నట విశ్వరూపం భారీ స్థాయిలో చూపించగా విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంది. ఆ తర్వాత
తమిళ సినిమా పరిశ్రమలో కూడా వరస ఆఫర్స్ తో బిజీగా గడిపింది. ఈ నేపథ్యంలోనే ఈమె ఎంతో ఇష్టపడి చేసిన కొన్ని లేడీ ఓరియంటెడ్ సినిమాలు భారీ స్థాయిలో నిరాశపరచడంతో ఒక్కసారిగా ఆమె క్రేజ్ తగ్గిపోయినట్లు అయ్యింది. ఇప్పుడు ఆమె ఆశలన్నీ ఈ సర్కార్ వారి పాట చిత్రంపైనే ఉన్నాయి. ఈ
సినిమా విడుదలై విజయం సాధిస్తే కమర్షియల్
హీరోయిన్ గా ఆమెకు గుర్తింపు వస్తుంది లేదంటే ఆమె కెరీర్ ఇబ్బందుల్లో కి వెళ్లడం ఖాయం.
అలా ఇప్పుడు
మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న ఈ ముద్దుగుమ్మకు మరిన్ని పెద్ద సినిమాల అవకాశాలు వస్తూ ఉండగా మళ్లీ ఆమె లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తుండటం ఆమె అభిమానులను తీవ్రంగా నిరాశ పరుస్తుంది. ఎక్కడ వీటితో మళ్లీ
కీర్తి సురేష్ కు ఫ్లాప్ తీసుకువస్తాయి అన్న అనుమానంతో వారు ఈ విధంగా టెన్షన్ పడుతున్నారట. వరుసగా సినిమాలు ఫ్లాపులు తీసుకువచ్చిన కూడా ఆమె ఎందుకు ఇలాంటి సినిమాల్లో నటిస్తోంది అర్థం కావడం లేదు అని అంటున్నారు. అంతేకాదు మలయాళ
సినిమా పరిశ్రమలో ఆమె నటించిన కొన్ని సినిమాలు కూడా ఇప్పుడు తెలుగులోకి డబ్ అవుతున్నాయి. వాష్ అనే
సినిమా కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.