టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ తాజాగా నటిస్తున్న  సినిమా కోసం ఇప్పుడు కేవలం టాలీవుడ్‌ ప్రేక్షకులు మాత్రమే కాకుండా యావత్‌ ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీ ఎదురుచూస్తోంది.ఇక బాహుబలితో ఒక్కసారిగా నేషనల్‌ హీరోగా మారడంతో ప్రభాస్‌ క్రేజ్‌ ఆకాశాన్నంటింది. కాగా దీంతో ప్రభాస్‌కు ఉన్న క్రేజ్‌ను ఉపయోగించుకునే క్రమంలో బాలీవుడ్ మేకర్స్‌ ఆదిపురుష్‌ చిత్రాన్ని హిందీలో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే అత్యంత భారీ బడ్జెట్‌తో పిరియాడిక్‌ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకులతో పాటు బాలీవుడ్‌ ఇండస్ట్రీ సైతం ఎదురు చూస్తోంది. 

ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమా విడుదలపై చర్చ జరుగుతోంది.కాగా  కరోనా కారణంగా మధ్యలో ఈ సినిమా చిత్రీకరణ వాయిదా పడతూ వచ్చింది.అయితే  దీంతో విడుదల తేదీ కూడా వాయిదా పడింది.ఇక తొలుత ఈ సినిమాను ఆగస్టులో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. ఇకపోతే కొన్ని కారణాల వల్ల చిత్ర యూనిట్‌ సినిమా తేదీని వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా ఆదిపురుష్‌ను ఈ ఏడాది దీపావళి కానుకగా విడుదల చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా చిత్ర నిర్మాత భూషన్‌ కుమార్..

ఓ బాలీవుడ్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే ఆదిపురుష్‌ సినిమా విడుదలపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.ప్రస్తుతం దీపావళికి విడుదలువుతుందా అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. చాలా సినిమాలు ఇప్పటికే దీపావళికి విడుదల తేదీలను ప్రకటించాయి. కాబట్టి దీపావళికి ఆదిపురుష్‌ రాదు అనే క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ లెక్కన ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఈ ఏడాదంతా వేచి చూడాల్సిందేనా..? లేదా 2022 ముగింపులో ఆదిపురుష్‌ వస్తుందా చూడాలి.మరోవైపు ప్రభాస్ తాజాగా నటించిన రాదేశ్యామ్ సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: