పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవుతున్న ప్రభాస్ సినిమా రాధేశ్యామ్.. సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తుంది. ఇప్పుడు విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేశారు.మార్చి 11న సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.. ఈ మేరకు సినిమా ప్రమోషన్స్ లో జోరు పెంచారు చిత్రయూనిట్. ఆ ట్రైలర్ సినిమా పై భారీ అంచనాలు ఎర్పడేలా చేసింది.. ప్రభాస్ లుక్ మొత్తం ట్రైలర్ లో కనిపించాయి. అవి సినిమా పై భారీ అంచనాలను పెంచుతున్నాయి.. అదే జోష్ అభిమానులను ఉంచెందుకు మరో ట్రైలర్ ను విడుదల చేశారు.



ముంబైలో గ్రాండ్ గా ప్రీరిలిజ్ ఈవెంట్ ను నిర్వహించారు. అందులో భాగంగా మరో ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ ను చాలా ఇంట్రెస్టింగ్ గా కట్ చేశారు..అందులో ప్రభాస్ చెప్పే డైలాగ్స్, సన్నివేశాలు చాలా బాగున్నాయి. అయితే ఓ ఫ్రేమ్ లో మాత్రం సత్యరాజ్ కనిపించడం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ సినిమాలో ప్రభాస్ గురువు పాత్రలో కృష్ణంరాజు నటించారు. తెలుగు వెర్షన్ లో మాత్రమే కృష్ణంరాజు కనిపిస్తారు. మిగిలిన భాషల్లో ఆ పాత్రలో సత్యరాజ్ కనిపిస్తారని టాక్. అయితే ఈరోజు విడుదలైన తెలుగు ట్రైలర్ వెర్షన్ లో సత్యరాజ్ కనిపించారు.. ఇది అందరికి షాక్ ఇచ్చారు..అన్నీ భాషలకు సంబంధించి ఒకే ట్రైలర్ ను కట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి..



తెలుగు వెర్షన్ లో విక్రమాదిత్య గురువుగా కృష్ణంరాజు మాత్రమే కనిపిస్తారని చెబుతున్నారు. పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మించింది.యూరప్ నేపథ్యంలో జరిగే పీరియాడికల్ లవ్‌స్టోరిగా ఈ సినిమాను తెరకెక్కించారు. దక్షిణాది భాషల్లో పాటలకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తుండగా, హిందీ పాటలకు మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్ బాణీలు అందిస్తున్నారు. ఇక తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌ ను అందిస్తున్నారు.. మొత్తానికి ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. మార్చి 11 న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: