టాలీవుడ్
సినిమా పరిశ్రమలో మెగా హీరోలకు భారీ స్థాయిలో అభిమానులు ఉన్నారు. కుర్ర హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోల వరకు ప్రతి ఒక్క మెగా
హీరో కూడా మంచి పాపులారిటీని అందుకున్నారు. అలా
మెగాస్టార్ చిరంజీవి వేసిన బాటలో మెగా హీరోలు సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ముఖ్యంగా మెగా అభిమానులను ఎంతగానో అలరిస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో
మెగాస్టార్ చిరంజీవి మరియు పవన్
కళ్యాణ్ ఇద్దరూ కూడా వరుసగా సినిమాలలో నటిస్తూ ఉండటం ప్రేక్షకులను ఏమాత్రం సంతృప్తి పరచడం లేదు.
అందరు కూడా ఇతర భాషలలో హిట్ అయిన చిత్రాల్లో నటించడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. కానీ వీరిద్దరు మాత్రం వరుస
రీమేక్ చేయడం ప్రేక్షకులను నిరాశపరుస్తుంది.
చిరంజీవి రీ ఎంట్రీ
సినిమా ఖైదీ నెంబర్ 150
తమిళ సినిమా కత్తి కు
రీమేక్ అన్న విషయం అందరికి తెలిసిందే. ఇప్పుడు కూడా ఆయన ఏకంగా రెండు
రీమేక్ సినిమాలు చేస్తున్నాడు. మలయాళ
సినిమా లుసిఫర్ ను తెలుగులో
గాడ్ ఫాదర్ అనే పేరుతో
సినిమా చేస్తుండగా తమిళంలో సూపర్హిట్ అయిన వేదాలం చిత్రం ను భోళా
శంకర్ గా
రీమేక్ చేస్తున్నాడు చిరు.
ఇటు పవన్
కళ్యాణ్ కూడా
హిందీ లో సూపర్ హిట్టయిన
పింక్ సినిమాని తెలుగులో వకీల్ సాబ్ గా చేసి హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత ఆయన చేసిన భీమ్లా
నాయక్ సినిమా కూడా మలయాళంలో ఘన విజయం సాధించిన సినిమాకి రీమేక్. అంతే కాదు ఇప్పుడు మరో
రీమేక్ కూడా చేయడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నారు. ఆవిధంగా వీరిద్దరూ
రీమేక్ చేయడం ఏమాత్రం రుచించడం లేదు. పెద్ద హీరోలు కనుక వీరికి తప్పకుండా మంచి కథలు వస్తూ ఉంటాయి. అలాంటి సినిమాలు చేయకుండా ఈ విధంగా సినిమాలు చేయడం పట్ల, ఆల్రెడీ చూసేసిన సినిమాలను చేయడం పట్ల అందరూ పెదవి విరుస్తున్నారు.