పాన్ ఇండియా హీరో ప్రభాస్ తాజాగా నటిస్తున్న సినిమా రాధేశ్యామ్. ఇక ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ కి జోడీగా పూజాహెగ్డే నటిస్తున్న విషయం తెలిసిందే. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని గోపి కృష్ణ మూవీస్ యు.వి.క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పాటలకి  మంచి రెస్పాన్స్ రాగా.. తాజాగా విడుదలైన ట్రైలర్ మాత్రం సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెంచేసింది. ఇప్పటికే సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా పరిస్థితుల వల్ల వాయిదా పడింది. ఇక అన్ని పనులు పూర్తి చేసుకొని ఈ సినిమా ఈనెల 11న చాలా గ్రాండ్ గా విడుదల కానుంది.

ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు చాలా జోరుగా నడుస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు ఇటీవల పూర్తి కావడం జరిగింది.ఇకపోతే యూ/ఏ సర్టిఫికెట్‌తో రాధేశ్యామ్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అంతేకాకుండా  2 గంటల 18 నిమిషాల రన్ టైమ్ లాక్ చేశారని తెలుస్తోంది. అయితే ప్రభాస్ సినిమాకి మొదటి సారి ఇంత తక్కువ రన్ టైం ఉండడం అభిమానులను ఈ విషయం తెగ నిరాశకు గురిచేస్తోంది. బాహుబలి సినిమా తర్వాత నుంచి ప్రభాస్ సినిమాల రన్ టైం సుమారు రెండు గంటల 30 నిమిషాలకు పైగానే ఉంటుంది.

అలాంటిది ఇపుడు రాధేశ్యామ్ సినిమా మాత్రం రెండు గంటల 18 నిమిషాలు ఉండడంతో ఫ్యాన్స్ మాత్రం తీవ్ర స్థాయిలో నిరాశ చెందుతున్నారు.ఇక పాన్ ఇండియా లెవెల్ లో రూపొందిన ఈ సినిమాలో మన రెబల్ స్టార్ కృష్ణంరాజు, భాగ్యశ్రీ కీలక పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే తెలుగులో కృష్ణంరాజు పోషించిన గురువు పాత్రను మిగతా భాషలలో సత్యరాజ్ పోషించారు. ఇకపోతే ఈ సినిమా పీరియాడికల్ రొమాంటిక్ లవ్ స్టొరీగా రూపొందిన రాధేశ్యామ్ మూవీపై భారీ అంచనాలున్నాయి.ఇదిలా ఉంటె ప్రభాస్‌కు గత చిత్రం సాహో ఆశించిన విజయాన్ని ఇవ్వలేదు. ఇక ఇప్పుడు ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ దక్కుతుందో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: