సూపర్ స్టార్ మహేష్ తో గతంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అతడు, ఖలేజా సినిమాలు తీసిన విషయం తెలిసిందే. మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ తీసిన అతడు సినిమా 2005లో రిలీజ్ అయి మంచి విజయం సొంతం చేసుకుంది, అనంతరం వీరిద్దరూ కలిసి చేసిన ఖలేజా సినిమా 2010లో విడుదలై ఆశించిన స్థాయి విజయం మాత్రం అందుకోలేకపోయింది. అనుష్క శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని కనకరత్న మూవీస్ బ్యానర్ పై సింగనమల రమేష్, సి కళ్యాణ్ నిర్మించారు.

ఇక అప్పటి నుండి మరొక్కసారి మహేష్, త్రివిక్రమ్ ల క్రేజీ కాంబినేషన్ కోసం ఎదురు చూస్తున్న సూపర్ స్టార్ ఫ్యాన్స్, ఆడియన్స్ ఎట్టకేలకు మళ్ళి 12 సంవత్సరాల తరువాత ఇటీవల అది సెట్ కావడంతో ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై మహేష్, త్రివిక్రమ్సినిమా రూపొందనుండగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. థమన్ సంగీతం అందించనున్న ఈ సినిమాకి మది ఫోటోగ్రాఫర్. ఇటీవల అధికారికంగా ప్రారంభమైన ఈ సినిమా రెగ్యులర్ షూట్ అతి త్వరలో ప్రారంభం కానుండగా ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం ఒక న్యూస్ లేటెస్ట్ గా టాలీవుడ్ వర్గాల్లో వైరల్ అవుతోంది. అదేమిటంటే, ఈ సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ని ఏప్రిల్ 2న ఉగాది పండుగ సందర్భంగా యూనిట్ విడుదల చేయనుందని టాక్.

ఇప్పటికే తన తాజా సినిమా సర్కారు వారి పాట చివరి దశ షూట్ లో పాల్గొంటున్న సూపర్ స్టార్ మహేష్, మరోవైపు త్రివిక్రమ్ మూవీ కోసం కూడా మరింత స్టైలిష్ గా సిద్ధం అవనున్నారని తెలుస్తోంది. భారీ యాక్షన్ తో కూడిన ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్టైనర్ గా దర్శకుడు త్రివిక్రమ్సినిమా తెరకెక్కించనున్నారట. కాగా ఈ సినిమాని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసేలా యూనిట్ సన్నాహాలు చేస్తోందట. మరి ఎన్నో ఏళ్ళ విరామం తరువాత మరొక్కసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్న మహేష్, త్రివిక్రమ్ ల కాంబో ఎంత మేర సక్సెస్ అందుకుంటుందో తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: