పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా రాధాకృష్ణ కుమార్ డైరెక్టర్ గా వ్యవహరించిన ఈ చిత్రాన్ని మార్చి 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. దాదాపు 300 కోట్ల పైచిలుకు బడ్జెట్తో నిర్మితమైన ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ప్రభాస్ స్వయంగా ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో ఉన్నారు. ఇందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రభాస్ ఈ సినిమా విషయంలో తాను ఫాలో అవుతున్న సెంటిమెంటును బయటపెట్టారు
ప్రభాస్ సినిమాల్లో సత్యరాజ్ వరుసగా నటిస్తున్నాడు.వీరిద్దరూ కలిసి మిర్చి సినిమా చేశారు. అది సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత బాహుబలి సినిమా చేశారు. అది కూడా సూపర్హిట్ అయింది. ఇప్పుడు కూడా ఆయనతో రాధే శ్యామ్ చిత్రం చేస్తున్నారు ఇది కూడా వాటి తరహాలోనే మంచి విజయాన్ని అందుకుంటుంది అని ప్రభాస్ నమ్ముతున్నాడట. ఈ విషయాన్ని ప్రభాస్ చెప్పుకొచ్చారు. మరి నిజంగా ప్రభాస్ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యి ఈ చిత్రం సూపర్ హిట్ అవుతుందా లేదా అనేది చూడాలి. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి తమన్ నేపథ్య సంగీతాన్ని అందిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయి లో వస్తున్న ఈ సినిమా ఎట్ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి.