అల్లుడు శీను
సినిమా తో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన
హీరో బెల్లంకొండ శ్రీనివాస్. ఆయన హీరోగా తెరకెక్కిన తొలి సినిమాతోనే
మాస్ ప్రేక్షకులను విపరీతంగా అలరించాడు. తన ప్రతి సినిమాలోనూ పెద్ద
హీరోయిన్ తో మాత్రమే నటించే ఈ
హీరో అతి తక్కువ కాలంలోనే ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే ఆయన చిత్రాలు విజయం సాధించక పోవడం వల్ల ఆయన భారీ స్థాయిలో గుర్తింపు మాత్రం అందుకోలేక పోయాడు. దాంతో
బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పుడు
బాలీవుడ్ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేయడానికి సిద్ధం అవుతున్నాడు.
ఆయన హీరోగా నటించిన కొన్ని తెలుగు సినిమాలు హిందీలో
యూట్యూబ్ ఛానల్ లో వచ్చి
బాలీవుడ్ ప్రేక్షకులను అలరించాయి. ఆయన సినిమాలకు కోట్లల్లో వ్యూస్ లభించడంతో తనకు
బాలీవుడ్ సినిమా పరిశ్రమలో మంచి క్రేజ్ ఉందని గమనించిన ఈ
హీరో అక్కడ డైరెక్ట్ గా ఓ
సినిమా చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనకు వచ్చి వినాయక్ తో కలిసి అక్కడ చత్రపతి
సినిమా రీమేక్ చేస్తున్నాడు. ఆ విధంగా ఈ చిత్రం మొదలైంది. చివరిదశ షూటింగ్ కు వచ్చింది. ఈ నేపథ్యంలో త్వరలోనే విడుదల తేదీ ప్రకటించనున్నారు.
అయితే
బాలీవుడ్ లో తనకు ఉన్న క్రేజ్ ను పెంచుకోవడానికి ఈ
సినిమా చేసినా
బెల్లంకొండ శ్రీనివాస్ ఆ తర్వాత కూడా మరో
బాలీవుడ్ సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నాడు. ఈ విధంగా ఆయన తెలుగులో సినిమాలు చేయడానికి ఎక్కువగా మొగ్గు చూపకపోవడం పట్ల ఆయన అభిమానులు కొంత నిరాశ పడుతున్నారు. ఆయన ఇప్పటి వరకు ఏ తెలుగు
సినిమా కూడా మొదలుపెట్టలేదు. అల్లుడు
సినిమా తర్వాత ఆయన ఏ సినిమాలో నటిస్తున్నాడు అన్న ఆసక్తి అందరిలో మొదలయ్యింది. ఎందుకు ఆయన తెలుగులో నటించడం కంటే ఎక్కువగా
హిందీ లో నటించడానికి మొగ్గుచూపుతున్నారు అలా ఇప్పుడు వరుసగా రెండు సినిమాలు కూడా అక్కడ చేయడానికి సిద్ధం అవుతున్నాడు ఈ నేపథ్యంలో తెలుగులో ఆయన కెరియర్ ఏమవుతుందో చూడాలి.