'కొత్త బంగారు లోకం' సినిమాతో డైరెక్టర్ గా ఫస్ట్ సినిమాతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకుని పరిశ్రమ దృష్టిని ఆకర్షించాడు శ్రీకాంత్ అడ్డాల. ఈ సినిమా తరువాత సూపర్ స్టార్ మహేష్, విక్టరీ వెంకటేష్ ఇద్దరు స్టార్ హీరోలతో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' వంటి భారీ మల్టీస్టారర్ని తెరకెక్కించే అరుదైన అవకాశాన్ని దక్కించుకుని సంచలనం సృష్టించాడు. ఇక అలాంటి దర్శకుడి కెరీర్ 'బ్రహ్మాత్సవం' సినిమా తరువాత గాడి తప్పింది.ఇక ఎటు వెళ్లాలో.. ఏం చేయాలతో తెలియని ఆయోమయ అతన్ని స్థితిలోకి నెట్టేసింది.విక్టరీ వెంకటేష్ తో 'నారప్ప' సినిమా చేసినా అది రీమేక్ కావడంతో ఆ క్రెడిట్ మొత్తం విక్టరీ వెంకటేష్ కే వెళ్లింది. దాంతో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మళ్లీ ఆలోచనలో పడ్డాడట. ఇక ఈ నేపథ్యంలో చిన్న సినిమా చేసి దాన్ని మంచి హిట్ గా మలిచి తానేంటో నిరూపించుకోవాలని ఆ తరువాత మరో భారీ మల్టీస్టారర్ మూవీకి శ్రీకారం చుట్టాలని ఇతను భావిస్తున్నాడట. ఇక ఈ క్రమంలో ఆయన ఓ స్టార్ ప్రొడ్యూసర్ కొడుకుని హీరోగా పరిచయం చేస్తూ ఓ ప్రేమకథా సినిమాని చేయబోతున్నారట.


ఇటీవల బాలకృష్ణతో 'అఖండ' సినిమా వంటి బ్లాక్ బస్టర్ హిట్ ని అందించిన నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి త్వరలో తన కుమారుడిని హీరోగా పరిచయం చేయాలనుకుంటున్నారట.ఆ బాధ్యతల్ని తాజాగా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలకు అప్పగించారని సమాచారం తెలిసింది. ప్రస్తుతం కథా చర్చలు కూడా జరుగుతున్నాయట. వన్స్ స్టోరీ కంప్లీట్ కాగానే పవర్ ఫుల్ లవ్ స్టోరీని మిర్యాల రవీందర్ రెడ్డి కొడుకుతో పట్టాలెక్కిస్తారని సమాచారం తెలిసింది.ఇక ఇదిలా వుంటే ఈ సినిమా తరువాత శ్రీకాంత్ అడ్డాల భారీ మల్టీస్టారర్ ని చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారట. దీనికి 'అన్నాయ్' అనే టైటిల్ని కూడా ఫైనల్ చేసుకున్నారని ఇక ఈ సినిమాని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని చెబుతున్నారు.అయితే ముందు ఓ హిట్టు కొట్టాకే ఈ మల్టీస్టారర్ సినిమాని తెరపైకి తీసుకురావాలని శ్రీకాంత్ అడ్డాల భావిస్తున్నారని సమాచారం తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: