ఇటీవల బాలకృష్ణతో 'అఖండ' సినిమా వంటి బ్లాక్ బస్టర్ హిట్ ని అందించిన నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి త్వరలో తన కుమారుడిని హీరోగా పరిచయం చేయాలనుకుంటున్నారట.ఆ బాధ్యతల్ని తాజాగా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలకు అప్పగించారని సమాచారం తెలిసింది. ప్రస్తుతం కథా చర్చలు కూడా జరుగుతున్నాయట. వన్స్ స్టోరీ కంప్లీట్ కాగానే పవర్ ఫుల్ లవ్ స్టోరీని మిర్యాల రవీందర్ రెడ్డి కొడుకుతో పట్టాలెక్కిస్తారని సమాచారం తెలిసింది.ఇక ఇదిలా వుంటే ఈ సినిమా తరువాత శ్రీకాంత్ అడ్డాల భారీ మల్టీస్టారర్ ని చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారట. దీనికి 'అన్నాయ్' అనే టైటిల్ని కూడా ఫైనల్ చేసుకున్నారని ఇక ఈ సినిమాని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని చెబుతున్నారు.అయితే ముందు ఓ హిట్టు కొట్టాకే ఈ మల్టీస్టారర్ సినిమాని తెరపైకి తీసుకురావాలని శ్రీకాంత్ అడ్డాల భావిస్తున్నారని సమాచారం తెలిసింది.
ఇటీవల బాలకృష్ణతో 'అఖండ' సినిమా వంటి బ్లాక్ బస్టర్ హిట్ ని అందించిన నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి త్వరలో తన కుమారుడిని హీరోగా పరిచయం చేయాలనుకుంటున్నారట.ఆ బాధ్యతల్ని తాజాగా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలకు అప్పగించారని సమాచారం తెలిసింది. ప్రస్తుతం కథా చర్చలు కూడా జరుగుతున్నాయట. వన్స్ స్టోరీ కంప్లీట్ కాగానే పవర్ ఫుల్ లవ్ స్టోరీని మిర్యాల రవీందర్ రెడ్డి కొడుకుతో పట్టాలెక్కిస్తారని సమాచారం తెలిసింది.ఇక ఇదిలా వుంటే ఈ సినిమా తరువాత శ్రీకాంత్ అడ్డాల భారీ మల్టీస్టారర్ ని చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారట. దీనికి 'అన్నాయ్' అనే టైటిల్ని కూడా ఫైనల్ చేసుకున్నారని ఇక ఈ సినిమాని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని చెబుతున్నారు.అయితే ముందు ఓ హిట్టు కొట్టాకే ఈ మల్టీస్టారర్ సినిమాని తెరపైకి తీసుకురావాలని శ్రీకాంత్ అడ్డాల భావిస్తున్నారని సమాచారం తెలిసింది.