తెలుగు లో సినిమాల కన్నా కూడా ఎక్కువగా ఐటమ్ సాంగ్స్ బాగా ఫెమస్ అవుతున్నాయి..ఎందుకంటే ఆ పాట లలో ఎక్కువ హీరోయిన్లు కనిపిస్తున్నారు. దాంతో సినిమా కన్నా కూడా ఎక్కువగా స్పెషల్ సాంగ్స్ మంచి క్రేజ్ ను అందుకున్నాయి. అందుకే స్టార్ హీరోయిన్లు కూడా ఐటమ్ సాంగ్స్ లలో కనిపించాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇటీవల స్టార్ హీరోయిన్ సమంత కూడా ఐటమ్ సాంగ్ ను చేసింది. పుష్ప మూవీ లోని ఊ అంటావా మావా అంటూ సాంగ్ లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. భారీ రెమ్యునరేషన్ ను కూడా అందుకుంది.. సామ్ తర్వాత ఇప్పుడు మరో హీరోయిన్  కూడా అదే పనిలొ ఉంది. ఈ వార్త ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.


ఈమధ్య ఐటమ్ సాంగ్స్ ట్రెండ్ పెరగడంతో సినీ అభిమానులను ఆకట్టుకోవడంలో స్పెషల్ సాంగ్స్ తో సినిమా ప్రత్యేక స్రద్దను చూపిస్తున్నారు మేకర్స్. ఇది టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అన్ని ఇండస్ట్రీలలో ఇదే వరస కొనసాగుతుంది..బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ అంతా ఇప్పటికే ఈ ఐటమ్స్ సాంగ్స్ లో స్టెప్పులేసి అందరి దృష్టిని ఆకర్షించారు. జనతా గ్యారేజ్ లో కాజల్, పుష్పలో సమంత, గనిలో తమన్నా,ఆచార్యలో రెజినా కనిపించి అందరినీ కట్టిపడేస్తున్నారు.


 ఇది ఇలా ఉండగా.. ఇప్పుడు నేషనల్ క్రష్ రష్మిక కూడా అదే ప్రయోగం చేస్తుంది. రష్మికకు ఓ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం అఫర్ వచ్చిందనే వార్తలు చక్కర్లు కోడుతున్నాయి.. అర్జున్ రెడ్డితో టాలీవుడ్‌లో సెన్సేషన్ సృష్టించి, అదే సినిమాను బాలీవుడ్ లో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టిన సందీప్ వంగా.. ఇప్పుడు రణబీర్ కపూర్ తో మరో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పరిణీతి చోప్రా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.. ఇక అందులో  స్పెషల్ సాంగ్ కోసం రష్మికను తీసుకోవాలనే ఆలోచన చేస్తున్నారట. హిందీలో ఇప్పటికే పుష్పతో స్టార్ హీరోయిన్ గా మారి నేషనల్ క్రష్ అనిపించుకున్న రష్మిక ఇప్పుడు అక్కడ వరస సినిమాలు చేస్తూ రచ్చ చెస్తుంది.. ఐటమ్ పాపగా అదరగోడితే ఇక అమ్మడును పట్టుకోవడం సాధ్యం కాదు..


మరింత సమాచారం తెలుసుకోండి: