టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ కి ఈ మధ్యకాలంలో సరైన హిట్ పడి చాలా రోజులైంది. ఇలాంటి సమయంలో తన ఇమేజ్కి తగ్గ మాస్ యాక్షన్ ఓరియంటెడ్ సినిమా చేసి  హిట్ కొట్టాలని ఆయన అభిమానులు ఎదురు చూస్తున్నారు. కానీ గోపిచంద్ మాత్రం ఇప్పుడు అలా కాకుండా సరి కొత్తగా ప్రయోగాలు చేయడానికి సిద్ధమవుతున్నాడు. గోపీచంద్ అంటే మాస్ యాక్షన్ ఇమేజ్ ఎక్కువ ఉంటుంది.అయితే ఈ హీరో గతంలో కొన్ని ప్రయోగాలు చేశారు. కానీ అంతగా వర్కవుట్ కాలేదు. అయినా కూడా ఇప్పుడు తన ప్రయోగాలు ఆపడం లేదు. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో పక్కా కమర్షియల్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాతో పాటూ ఇటీవలే శ్రీవాస్ దర్శకత్వంలో తన 30వ సినిమాను కూడా మొదలు పెట్టాడు గోపిచంద్. ఆ సినిమా కూడా మాస్ గా ఉంటుంది అని అంటున్నాడు. ఇక ఆ సినిమా తర్వాత గోపీచంద్ యువ దర్శకుడితో సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్లో అ!, జాంబీ రెడ్డి లాంటి సినిమాలతో అలరించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రస్తుతం యువహీరో తేజ సజ్జ తో హనుమాన్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇది సైన్స్ ఫిక్షన్ సోషియో ఫాంటసీ సినిమాగా రూపొందుతోంది. అయితే ఈ దర్శకుడితో ఇప్పుడు గోపీచంద్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు గా లేటెస్ట్ ఫిల్మ్ నగర్ టాక్.

అందుతున్న సమాచారం ప్రకారం గోపిచంద్ కోసం ప్రశాంత్ వర్మ మంచి కథ రెడీ చేశారని.. ఇటీవల ఆ కథని గోపీచంద్కు వినిపించారట. ప్రస్తుతం ఈ కథ కోసం ఇద్దరి మధ్య చర్చలు కూడా జరుగుతున్నాయని తెలుస్తోంది. హనుమాన్ సినిమా తర్వాత ఈ కథే పట్టాలెక్కబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ప్రశాంత్ వర్మ తతీసిన సినిమాలన్నీ ప్రయోగాలతో కూడి ఉంటాయి. ఇప్పుడు గోపీచంద్తో అనుకున్న కథ కూడా ఓ ప్రయోగాత్మక సినిమాని తెలుస్తోంది. మరి ఇ ప్రశాంత్ వర్మ గోపీచంద్ కాంబో సినిమా ఓకే అవుతుందా? ఒకవేళ ఓకే అయితే ప్రశాంత్ వర్మ గోపీచంద్ కోసం తన పంథాను మార్చుకుని ఒక మాస్ మసాలా సినిమా తీస్తాడా? లేక తన జోనర్ లోనే వెళ్తారా అనేది చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: