కొత్త బంగారులోకం
సినిమా తో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. మంచి టేస్ట్ ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఆయన తన రెండో సినిమానే భారీ మల్టీస్టారర్ సినిమాగా చేస్తాడని ఎవరు కూడా కలలో కూడా ఊహించలేదు. అలా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
సినిమా తెలుగు
సినిమా పరిశ్రమలో మంచి సినిమాలు రావడానికి నాంది పలికింది. మహేష్ బాబు మరియు
వెంకటేష్ లాంటి స్టార్
హీరో లను కలిపి
సినిమా చేయడం దానిని ప్రేక్షకులు చూసి విజయవంతం చేయడం జరిగింది.
ఈ విధమైన ఆలోచన చేసిన
శ్రీకాంత్ అడ్డాల కే ఈ విజయం యొక్క పూర్తి క్రెడిట్ దక్కింది అని చెప్పాలి. అయితే ఆయన దురదృష్టం ఈ చిత్రం తర్వాత ఆయన బ్రహ్మోత్సవం అనే
సినిమా చేయడం. ఆ
సినిమా ఫ్లాప్ అవడంతో ఆయన ను కిందికి వెళ్లేలా చేసింది. దాంతో ఆయన మరో
సినిమా చేయడానికి కొన్ని సంవత్సరాల సమయం పట్టింది. ఆ విధంగా
వెంకటేష్ హీరోగా చేసిన
నారప్ప సినిమాతో మళ్ళీ విజయాన్ని అందుకొనీ ఇప్పుడు దర్శకుడిగా నిలబడేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు.
ఈ నేపథ్యంలో ఆ తర్వాత ఆయన చేయబోయే సినిమాపై ఇప్పుడు అందరిలో ఆసక్తి నెలకొనెలా చేసింది. తొందర్లోనే ఓ మల్టీస్టారర్
సినిమా చేయబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి హీరో ఎవరు అనేది తెలియాల్సి ఉంది. ఈ దర్శకుడి ను ఎవరు నమ్మే పరిస్థితులలో లేని నేపథ్యంలో ఆయన ఎ లాంటి కథ చెప్పి వారిని ఒప్పిస్తాడు చూడాలి. మరొకవైపు ముగ్గురు హీరోలు ఉండే
సినిమా కూడా ఆయన చేస్తున్నాడని అంటున్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు గానీ తెలియాలంటే
శ్రీకాంత్ అడ్డాల నోరు విప్పాల్సిందే. ఆయన అభిమానులు మాత్రం ఆయన చేయబోయే తదుపరి
సినిమా కోసం ఎంతో ఎదురు చూస్తున్నారు.