విపరీతంగా ఈ సినిమాపై ట్రోల్స్ అలాగే రూమర్స్ క్రియేట్ చేస్తూ నెగిటివ్ టాక్ వచ్చేలా చేస్తున్నారు. ఇకపోతే ఇప్పటికీ ట్రోల్స్ చేస్తున్న వారిపై తమన్ గట్టిగానే కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా ట్రోల్స్ క్రియేట్ చేస్తున్న ట్రోలర్స్ కి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు సినిమా డైరెక్టర్ రాధాకృష్ణ.. రాధాకృష్ణ మాట్లాడుతూ మీరు వెజిటేరియన్ హోటల్ కి వెళ్లి చికెన్ బిర్యానీ పెడతారని ఎలా ఆశిస్తారు..? రాధే శ్యామ్ సినిమా కూడా ఇంటెన్సివ్ స్టోరీ అని ముందు నుంచి మేము మీకు చెప్పడం జరిగింది. కానీ ఒక ప్రేమ కథ నుంచి ఇంకేం ఆశిస్తారు.. ఇందులో కమర్షియల్ అంశాలు ఉన్న సినిమా కాదు పూర్తిగా లవ్ స్టోరీ సినిమా మాత్రమే అని నేను చెప్పాను.. ప్రేమకథ సినిమాలు చూసిన వారికి మాత్రమే ఈ సినిమా నచ్చుతుంది అని తెలిపాడు.
ఈ సినిమా పై నెగిటివ్ ప్రచారం చేసినప్పటికీ ఏకంగా మూడు రోజుల్లో రూ . 151 కోట్ల గ్రాస్ కలెక్షన్ వసూలు చేసి రికార్డు సృష్టించింది .ఒక ఎలాంటి రూమర్స్ వచ్చిన భయపడేదే లేదు అంటూ ఆయన గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది.