నేషనల్ స్టార్ హీరో ప్రభాస్ హీరోగా - బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం రాధే శ్యామ్. ఈ సినిమా మార్చి 11వ తేదీన విడుదల అయ్యి మంచి విజయం సాధించిందని చెప్పవచ్చు. అయితే కొంత మంది మాత్రం ఈ సినిమాపై నెగెటివ్ టాక్ ప్రచారం చేస్తూ ఉన్నారు . అంతే కాదు ప్రభాస్ అంటే మాస్ ఎలివేషన్స్ తో కూడిన బాహుబలి, సాహో లాంటి సినిమాలు కావాలి అని అభిమానులు ఆశిస్తున్నారు అన్నట్లుగా రూమర్స్ క్రియేట్ చేయడం గమనార్హం. ఒక మంచి ప్రేమ కథ సినిమా అని అర్థం చేసుకున్న వారు ఈ సినిమాని చాలా చక్కగా ఆదరించారు . కానీ కొంతమందికి మాత్రం ఈ సినిమా పూర్తిగా నిరాశపరిచింది అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇందులో ఒక్క యాక్షన్ సీన్ కూడా లేకపోవడం అందులోనూ ప్రభాస్ అయ్యుండి కూడా ఒక ఫైట్ లేని, కామెడీ లేని సినిమా కావడంతో మాస్ ఆడియన్స్ పూర్తిగా నిరాశ చెందారు.


విపరీతంగా ఈ సినిమాపై ట్రోల్స్ అలాగే రూమర్స్ క్రియేట్ చేస్తూ నెగిటివ్ టాక్ వచ్చేలా చేస్తున్నారు. ఇకపోతే ఇప్పటికీ ట్రోల్స్ చేస్తున్న వారిపై తమన్ గట్టిగానే కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా ట్రోల్స్ క్రియేట్ చేస్తున్న   ట్రోలర్స్ కి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు సినిమా డైరెక్టర్ రాధాకృష్ణ.. రాధాకృష్ణ మాట్లాడుతూ మీరు వెజిటేరియన్ హోటల్ కి వెళ్లి చికెన్ బిర్యానీ పెడతారని ఎలా ఆశిస్తారు..? రాధే శ్యామ్  సినిమా కూడా ఇంటెన్సివ్ స్టోరీ అని ముందు నుంచి మేము మీకు చెప్పడం జరిగింది. కానీ ఒక ప్రేమ కథ నుంచి ఇంకేం ఆశిస్తారు.. ఇందులో కమర్షియల్ అంశాలు ఉన్న సినిమా కాదు పూర్తిగా లవ్ స్టోరీ సినిమా మాత్రమే అని నేను చెప్పాను.. ప్రేమకథ సినిమాలు చూసిన వారికి మాత్రమే ఈ సినిమా నచ్చుతుంది అని తెలిపాడు.

సినిమా పై నెగిటివ్ ప్రచారం చేసినప్పటికీ ఏకంగా మూడు రోజుల్లో రూ . 151 కోట్ల గ్రాస్ కలెక్షన్ వసూలు చేసి రికార్డు సృష్టించింది .ఒక ఎలాంటి రూమర్స్ వచ్చిన భయపడేదే లేదు అంటూ ఆయన గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: