దాదాపు మూడు సంవత్సరాల విరామం తర్వాత మళ్లీ కెమెరా ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ అందరినీ ముఖ్యంగా తన అభిమానులను తన సినిమాలతో ఎంతగానో ఆలరిస్తున్నాడు. వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న పవన్ కళ్యాణ్ తన రీ ఎంట్రీ అదిరిపోయే విధంగా ప్రారంభించాడు. బాలీవుడ్ లో తెరకెక్కిన పింక్ సినిమా ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడం పట్ల చాలామంది ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు.

అలా తన సెకండ్ ఇన్నింగ్స్ లో వచ్చిన సినిమాలను ఒప్పుకున్న పవన్ కళ్యాణ్ ఎక్కువగా రీమేక్ సినిమాలకే ప్రాధాన్యత ఇవ్వడం మొదలు పెట్టారని తెలుస్తోంది. దీనిలో భాగంగానే ఇటీవల ఆయన భీమ్లా నాయక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా కూడా మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన అయ్యపనుం కోశియం చిత్రం ఆధారంగా తెరకెక్కింది. సాగర్ చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాకి త్రివిక్రమ్ రచయిత వ్యవహరించాడు. ఈ నేపథ్యంలో ప్రతి సినిమాకి 50 కోట్ల పారితోషికం తీసుకొని చేస్తున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్నాడు.

సినిమా తర్వాత కూడా మరొక రీమేక్ పై పవన్ నటించడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాడు. ఆ విధంగా ఈ సినిమా కోసం 20 రోజుల డేట్స్ కేటాయించిన పవన్ కళ్యాణ్ త్వరలోనే ఈ చిత్రాన్ని చేయడానికి రెడీ అవుతున్నారు. దీనికి కూడా త్రివిక్రమ్ రచయిత గా వ్యవహరిస్తుండగా ఇందులో సాయి ధరమ్ తేజ్హీరో గా నటిస్తున్నాడని ప్రచారం జరుగుతుంది.ఇకపోతే మరిన్ని రీమేక్ సినిమాలను ఆయన చేయబోతున్నాడట. ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతుంది అని చెప్పవచ్చు. ఈ సినిమా తర్వాత పవన్ ఏ సినిమాలను రీమేక్ చేయబోతున్నారు అనేది అధికారికంగా ప్రకటన రాబోతుంది. పవన్ కళ్యాణ్ నుంచి ఒరిజినల్ సినిమాలను ఆశించే వారికి ఇది నిజంగా నిరాశాజనకమైన వార్త అనే చెప్పాలి. మరి ఫ్యాన్స్ దీనికి సంబంధించి ఏ విధమైన అసహనాన్ని వ్యక్తం చేస్తారో చూడాలి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరియు హరిష్ శంకర్ దర్శకత్వంలో కూడా ఆయన  సినిమాలు చేయవలసి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: