తెలుగు సినీ ఇండస్ట్రీ లో ఉన్న బడా నిర్మాతలలో బెల్లంకొండ సురేష్ కూడా ఒకరు. ఈయనకు ఉన్న సినిమా ప్యాషన్ కారణంగానే  తన కుమారులను ఇద్దరిని కూడా ఇండస్ట్రీలోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టి బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. చిన్న కొడుకు బెల్లంకొండ గణేష్ కూడా ఇటీవల మేకప్ వేసుకున్న విషయం తెలిసిందే. బెల్లంకొండ గణేష్ తాజాగా స్వాతిముత్యం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. అయితే ఇప్పటికే బెల్లంకొండ గణేష్ నిర్మాణ రంగంలో కూడా పలు అనుభవాలను సంపాదించుకున్నారు.


ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో పలు విభాగాల్లో పని చేసి ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టక ముందే ఎదురయ్యే కష్టనష్టాలను బేరీజు వేసుకోవడానికి బెల్లంకొండ సురేష్ తన చిన్న కుమారుడు కి అవకాశం కల్పించడం గమనార్హం. ఇకపోతే తాజాగా బెల్లంకొండ సురేష్ దంపతులు వివాహమై 30 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీలంకలో వివాహ వార్షికోత్సవం జరుపుకున్నారు. అంతేకాదు ఈ దంపతులకు వారి కుమారులు ఇద్దరు ఇంస్టాగ్రామ్ వేదికగా పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేయడం విశేషం.ఈ వివాహ మహోత్సవ వేడుకలను శ్రీలంకలో బెల్లంకొండ సురేష్ ఆయన భార్య పద్మ అలాగే కుమారులు సాయి శ్రీనివాస్, గణేష్ నలుగురు కూడా ఘనంగా వేడుకలు జరుపుకున్న ట్లు సమాచారం. వీరు నలుగురూ కలిసి ఒకేచోట ఫోటో దిగగా ఆ ఫోటోను సాయి శ్రీనివాస్ అభిమానులతో ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకున్నారు. ఇదిలా వుండగా బెల్లంకొండ సురేష్ వైట్ అండ్ వైట్ దుస్తుల్ని ధరించగా..ఆయన సతీమణి పద్మ సంప్రదాయ సారీలో కనిపిస్తున్నారు. ఇక కుమారులిద్దరు బ్లాక్ అండ్ బ్లాక్ లో నవ్వులు చిందిస్తున్నారు. ఇక ప్రస్తుతం వీరికి సంబంధించిన ఈ ఫోటో ఈ ఫోటో ఇన్ స్టాలో వైరల్ గా మారింది. బెల్లంకొండ ఫ్యామిలీ ఫాలోవర్స్ అంతా ప్రత్యేకంగా ఈ దంపతులకు విషెస్ తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: