జై ఎన్టీఆర్.. జై రామ్ చరణ్.. ప్రస్తుతం ఏ థియేటర్ దగ్గర చూసినా ఇక ఇలాంటి నినాదాలు వినిపిస్తున్నాయి. అభిమానుల ఈలలు గోలలతో థియేటర్ లు మొత్తం దద్దరిల్లిపోతున్నాయి. ఎన్నో రోజుల నుంచి అభిమానులు అందరూ ఎదురుచూస్తున్న త్రిబుల్ ఆర్ సినిమా విడుదలయ్యింది.  జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోగా నటించిన మల్టీ స్టారర్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా పది వేల తెరలపై ఈ సినిమా గ్రాండ్గా రిలీజ్ అయింది. ఇప్పటి వరకు ఏ సినిమా కూడా ఇంత భారీగా పదివేల తెరపై విడుదల కాలేదు అని చెప్పాలి. ఎన్నో సార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు థియేటర్ లోకి వచ్చేసింది.



 దీంతో దర్శక ధీరుడు జక్కన్న చెక్కిన త్రిబుల్ ఆర్ అనే సినిమాను చూసేందుకు ప్రేక్షకులందరూ థియేటర్లకు బారులు తీరుతున్నారు. ఇప్పటికే ప్రీమియర్ షోలు మొదలయ్యాయి. ఇక మొదటి రోజు కుదరకపోతే ఆ తర్వాత రోజైనా సినిమా చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే త్రిబుల్ ఆర్ సినిమా కు ఉన్న బజ్ నేపథ్యంలో సినిమా టికెట్లు దొరకడం చాలా కష్టం గా మారిపోయింది. ఇలాంటి సమయంలో ఇక కొంత మంది అభిమానులు మాత్రం ఏకంగా సినిమా చూడటానికి టికెట్లు దొరికిన తర్వాత కూడా వాటిని చింపేశారు అన్న వార్త మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.


 ఈ ఘటన చిత్తూరు జిల్లా కుప్పం లో వెలుగులోకి వచ్చిందట. కుప్పంలో చరణ్, తారక్ అభిమానుల మధ్య టికెట్ల విషయంలో చిన్న వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. త్రిబుల్ ఆర్  టికెట్లపై ఓ హీరో అభిమాన సంఘం నాయకుల పేర్లు ఉండడమే దీనికి కారణమట. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన మరో హీరో అభిమానులు ఎంతో ఆశగా సినిమా చూడాలని  త్రిబుల్ ఆర్ టికెట్ను కొనుగోలు చేసినప్పటికీ చివరికి కోపంతో వాటిని చింపేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే భారీ అంచనాల మధ్య విడుదలైన త్రిబుల్ ఆర్ సినిమా నేపథ్యంలో ఇక థియేటర్ల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు థియేటర్ల యాజమాన్యాలు అన్ని ఏర్పాట్లు చేశాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rrr