టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయనవసరం లేదు,  ఈ హీరో కెరియర్ ప్రారంభంలో కొన్ని సినిమాలలో నటించినప్పటికీ వెంకీ కుడుముల దర్శకత్వంలో రేష్మీక మందన  హీరోయిన్ గా తెరకెక్కిన ఛలో సినిమాతో నాగశౌర్య బాక్స్ ఆఫీస్  దగ్గర అదిరిపోయే విజయాన్ని అందుకున్నాడు.  ఈ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న నాగ శౌర్య ఆ తర్వాత కూడా అనేక సినిమాలలో హీరోగా నటించాడు,  కాకపోతే ఆ సినిమాలు ఏవి నాగ శౌర్య బాక్స్ ఆఫీస్  దగ్గర పెద్దగా విజయాలను తెచ్చి పెట్టలేదు.  ఇది ఇలా ఉంటే నాగ శౌర్య ఈ మధ్యనే  వరుడు కావలెను ,  లక్ష్య అనే రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరించాడు,  కాకపోతే ఈ రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి.  

ఇలా వరుస పరాజయాలతో డీలా పడిపోయిన నాగ శౌర్య తాజాగా కృష్ణ వ్రింద విహారి అనే సినిమాలో హీరోగా నటించాడు,  ఈ సినిమాలో నాగ శౌర్య కు జోడీగా షెర్లి సెటియా నటించింది.  ఈ మూవీ కి అనిష్ ఆర్.కృష్ణ దర్శకత్వం వహించగా.. ఐరా క్రియేషన్ పతాకంపై శంకర్ ప్రసాద్ మూల్పూరి సమర్పణలో నిర్మాత ఉష మూల్పూరి నిర్మించారు,  ఈ మూవీ అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఏప్రిల్ 22 న వరల్డ్ వైడ్‏గా రిలీజ్ కానుంది.  ఇది ఇలా ఉంటే ఈ మూవీ టీజర్ రిలీజ్ కార్యక్రమం మార్చి 28 న హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగింది,  ఈ కార్యక్రమానికి దర్శకుడు అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ మూవీ టీజర్ ను లాంచ్ చేశారు.  కార్యక్రమంలో భాగంగా నాగ శౌర్య మాట్లాడుతూ... మూవీ చాలా బాగా వచ్చింది,  ఒకప్పుడు ఇండస్ట్రీ లో రీ షూట్ తీస్తే మూవీ పోయింది అనేవాళ్ళు , ఇప్పుడు రీ షూట్ తీయకపోతే మూవీ పోయేలా ఉంది , పర్ఫెక్షన్ కోసం అలా తీసుకువచ్చారు అని నాగ శౌర్య ఈ కార్యక్రమంలో భాగంగా తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: