అందరి సినిమాలకి సంబంధించిన విషయాలను చిరంజీవి లీక్ చేస్తూ ఉంటాడు అని అందరూ అంటుంటారు. అయితే ఈ క్రమంలోనే చిరంజీవి సినిమా కి సంబంధించిన ఒక విషయాన్ని కూడా ఇప్పుడు లీక్ చేశారు.అయితే తాజాగా విజయ్‌ దేవరకొండ చిరంజీవి సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన విషయాన్ని లీక్‌ చేసి షాక్‌ ఇచ్చాడు. ఇకపోతే పూరి జగన్నాథ్‌తో విజయ్‌ దేవరకొండ చేస్తున్న 'జేజీఎం' సినిమా అనౌన్స్మెంట్‌ వేదికగా ఈ లీక్‌ ఇచ్చాడు విజయ్‌.అయితే  అదే 'చిరంజీవి సినిమాలో పూరి జగన్నాథ్‌'. ఇకపోతే  ఈ కాంబో కుదిరిందట. ఎలా అంటే  నటులుగా మాత్రమే నట.అయితే పూరి జగన్నాథ్‌ ఫ్రేమ్‌లో చిరంజీవిని చూడాలనే కోరిక లేని అభిమాని ఉండరు.

ఇకపోతే పూరి మాస్ ఫ్రేమ్‌లో చిరును చూసి మురిసిపోవాలని ప్రతి చిరు అభిమాని కోరుకుంటారు. ఇక  అప్పుడెప్పుడో అవుతుంది అనుకున్న ఈ సినిమా కుదరలేదు. అందుకే ఆ తర్వాత చిరంజీవి వేర్వేరు సినిమాలతో బిజీ అయిపోయారు. ఇదిలావుండగా అటు మరోవైపు పూరి కూడా అంతే. అయితే ఈ నేపథ్యంలో ఇంత త్వరగా పూరి, చిరు సినిమా చూడమా అనుకుంటుండగా. ఇకపోతే చల్లటి వార్త చెప్పాడు విజయ్‌. పూరిని దర్శకుడిగా, చిరును హీరోగా కాదు కానీ, ఇద్దరినీ నటులుగా చూస్తామట.అంతేకాదు త్వరలో చిరంజీవి - పూరి జగన్నాథ్‌ను ఒకే ఫ్రేమ్‌లో చూడొచ్చు అని చెప్పాడు విజయ్‌.ఇక  అది ఏ సినిమా అనేది మాత్రం చెప్పలేదు.

తాజాగా ప్రస్తుతం చిరంజీవికి సంబంధించి మూడు సినిమాలు సెట్స్‌ మీద ఉన్నాయి. అయితే వాటిలో ఏదో ఒక దానిలో ఇద్దరూ కలసి కనిపించొచ్చు. ఇకపోతే చిరంజీవి సినిమాల సంగతి చూస్తే బాబీ సినిమా 'వాల్తేరు వీరయ్య'  మెహర్‌ రమేశ్‌ 'భోళా శంకర్‌', మోహన్‌రాజా 'గాడ్ ఫాదర్' సెట్స్‌పై ఉన్నాయి. ఇక వీటిలో ఎందులో పూరి కనిపిస్తారనేది ఆసక్తికరం.ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న సోషల్‌ మీడియా బజ్‌ ప్రకారం అయితే బాబీ సినిమాలోనే చిరంజీవి పక్కన పూరిని చూడొచ్చు అని తెలుస్తోంది. ఇకపోతే మిగిలిన రెండు సినిమాల్లో పూరి కనిపించే స్థాయి పాత్రలు ఇంకా వేరే ఏవీ లేవు అని అంటున్నారు. ఇక ఇదంతా ఊహ మాత్రమే. చిరంజీవి తలచుకుంటే ఏ సినిమాలో అయినా పూరికి ఓ పాత్ర రాయించొచ్చు. అయితే గతంలో చాలా సినిమాల్లో ఇలా పాత్రలు రాయించి, సినిమాలో పెట్టించిన అనుభవాలు ఉన్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: