ప్రస్తుతం బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్  పాన్ ఇండియా స్టార్ హీరో  ప్రభాస్ తో 'ఆదిపురుష్' సినిమా చేస్తున్న సంగతి మనందరికీ  తెలిసిందే. అయితే తాజాగా ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ అయిపొయింది. ఇదిలా ఉంటే ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమాని రామాయణాన్ని ఆధారంగా  తెరకెక్కిస్తున్నట్టు తెలిపారు. ఇకపోతే ఇందులో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా కనిపించనున్నారు.తాజాగా ఇప్పుడు  ప్రస్తుతం 'ఆదిపురుష్' సినిమా పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది.ఓంరౌత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్, ప్రెస్టీజియస్ పాన్ ఇండియా సినిమాగా రాబోతుంది.ఇక  ఈ సినిమాకు పోస్ట్ ప్రొడక్షన్ పనులకోసం భారీ సమయం పడుతుంది.

అయితే పురాణ ఇతిహాస కథతో సినిమా కావడంతో ఈ సినిమా చాలా వరకు గ్రీన్‌ మ్యాట్‌పై చిత్రీకరించారట. అంతేకాకుండా దీంతో ఇప్పుడు నిర్మాణానంతర కార్యక్రమాలకు చాలా సమయం పడుతోంది. ఇకపోతే రూ.350 నుండి రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో T సిరీస్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుండి ఓ క్రేజీ అప్డేట్ వినిపిస్తుంది. ఇక అది ఏంటంటే భారతీయ పురాణాలలో అత్యంత ఇష్టపడే ఇతిహాసాలలో ఒకటైన రామాయణం ఆధారంగా రూపొందే ఈ సినిమాను అంతకు మించి అనే లెవెల్ లో విజువల్ ఎఫెక్ట్స్ ఉండనున్నాయని..

అంతే కాదు ఈ  సినిమాను కంప్లీట్ 3డీలో విడుదల చేయనున్నారని తెలుస్తుంది. ఇకపోతే ఇన్ని పనులు ఉన్నాయి కాబట్టే సినిమాను 2023లో విడుదల చేసే ప్లాన్ చేస్తున్నారట. అంతేకాకుండా ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు. ఇటీవలే ఆదిపురుష్ సీక్వెల్ కు సంబంధించి ప్రభాస్ తో దర్శకుడు చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ప్రభాస్ కూడా అందుకు సముఖత వ్యక్తం చేశాడని అంటున్నారు. అయితే దీనిపై ఇంకా పూర్తి స్పష్టత మాత్రం రావాల్సి ఉంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: