కేరళ బ్యూటీ అయిన అనుపమ పరమేశ్వరన్ ఉగాది పండుగను తన బ్యూటీతో  ఎంతో పరిపూర్ణం చేసింది. పట్టువస్త్రాలు ధరించి తెలుగువారిని బాగా ఆకట్టుకుంటోంది. తెలుగు నూతన సంవత్సరం సందర్భంగా అందరికీ  కూడా శుభాకాంక్షలు తెలిపింది.



యంగ్ హీరోయిన్ అయిన అనుపమ పరమేశ్వరన్ తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం. గ్లామర్ తో ఆకట్టుకోవడంలో ఈ సుందరి స్టైల్ వేరు.అనుపమ అందానికి అలాగే నటనకు ఇప్పటికే తెలుగు ప్రేక్షకులు అందరూ అభిమానులుగా మారారు.   



అనుపమ పట్టుచీర ధరిస్తే అచ్చు తెలుగమ్మాయిలాగే ఉంటుంది.. మరీ ముఖ్యంగా ఈ సుందరి స్పెషల్ అకేషన్స్, ప్రత్యేక పండుగల సందర్భంలో తన ఫ్యాన్స్ ను ఎంతో సర్ ప్రైజ్ చేస్తూ ఉంటుంది.స్పెషల్ విషెస్ కూడా చెబుతూ ఉంటుంది. 

 



తాజాగా, ఉగాది పండుగ సందర్భంగా అనుపమ పట్టు చీర కట్టుకొని కాస్లీ జ్యూవెల్లరీ ధరించి అభిమానులకు దర్శనమిచ్చింది. అచ్చమైన తెలుగమ్మాయిలా రెడీ అయ్యి కుర్రాళ్ల గుండెల్ని అనుపమ కొల్లగొడుతోంది. ఈ మేరకు తన ఫ్యాన్స్ కోసం పలు ఫొటోలను కూడా ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.

 



ఫొటోలు  షేర్ చేస్తూ ‘అందరికీ  కూడా ఉగాది శుభాకాంక్షలు’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇందుకు బదులుగా తెలుగు ఆడియెన్స్, నెటిజన్లు కూడా ఈ క్యూట్ హీరోయిన్ కు థ్యాంక్స్ చెబుతూ తిరిగి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. 

 



అనుపమ తాజా ఫొటోల్లో బాగా అందంగా కనిపిప్తోంది. ముఖ్యంగా  కత్తుల్లాంటి కంటి చూపులతో కుర్రకారుకు మతిపోగొడుతోంది ఈ కేరళ ముద్దుగుమ్మ.హాయిని కలిగించే  నవ్వుతో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది సొగసరి. ఒంటిపై ఎక్కువైన గ్లామర్ తో హోయలు పోతుంది బ్యూటీ.  

 



కేరీర్ విషయానికొస్తే అనుపమ ప్రస్తుతం తెలుగులోనే వరుసగా సినిమాల్లో నటిస్తోంది. గతేడాది ‘రౌడీ బాయ్స్’ చిత్రంతో అలరించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు 18 పేజెస్ మరియు కార్తీకేయ 2, బటర్ ఫ్లై చిత్రాల షూటింగ్ లో చాలా బిజీగా ఉంది.  ఏకకాలంలో మూడు సినిమాల్లో నటిస్తూ బిజియేస్ట్ హీరోయిన్ గా మారిపోయింది.

 



మరింత సమాచారం తెలుసుకోండి: