ప్రభాస్ బాలీవుడ్ లో చేస్తున్న తొలి సినిమా ఆదిపురుష్. ఈ సినిమా విడుదల కోసం ఆయన అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.  రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. రామాయణంలోని ప్రతి పాత్ర ఎంతో అద్భుతంగా ఉంటుంది అన్న సంగతి అందరికి తెలిసిందే. వాటిని ఈ సినిమా రూపంలో దర్శకుడు ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం అన్నది నిజంగా సాహసోపేతమైన నిర్ణయం.

ఈ నేపథ్యంలో రాముడి పాత్రలో డార్లింగ్ ఎలా కనిపిస్తాడు అన్న ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది. ఈ సినిమాలో రాముడు యొక్క వైభవాన్ని ఎంతో గొప్పగా చూపించబోతున్నాం అని చెబుతున్నారు. ప్రేక్షకుల ఊహకందని విధంగా ఈ సినిమాలోని సన్నివేశాలు ఉంటాయని చెబుతున్నారు. రామాయణం ఎప్పుడూ కూడా బలమైన ప్రభావాన్ని కలిగి ఉంటుంది. అలాంటి ఇతిహాసం పై ఎన్ని సినిమాలు వచ్చిన బోర్ కొట్టదు. అలా రాముడు యొక్క గుణగణాలను ఈ సినిమాలో చూపిస్తున్నారట. ఇందులో ఎన్నో అద్భుతమైన సీన్స్ ను డిసైడ్ చేశారట.

రామాయణం యొక్క కథ ఎంతో ప్రభావం చూపించిన కారణంగానే ఈ సినిమా తెరకెక్కించాలని అనుకున్నామని అంటున్నారు. ఈ సినిమా షూటింగ్ అనుభవాన్ని ఎప్పటికీ మర్చిపోలేను అని కూడా చెబుతున్నారు. ఎన్ని సినిమాలు చేసినా కూడా కొన్ని సినిమాలు మాత్రమే స్పెషల్ గా ఉంటాయి అలాంటి చిత్రాల్లో నెంబర్ వన్ స్థానాన్ని ఈ సినిమా కి ఇస్తానని ఆయన చెప్పారు. దానితో పాటు ఇద్దరు స్టార్ హీరోలతో పని చేయడం గొప్ప అనుభూతిని ఇచ్చింది అని కూడా ఆయన అన్నారు. షూటింగ్ సమయంలో ప్రభాస్ ను ఆపడం ఎవరి తరం కాదని ఆయన చెప్పా.రు రాముడు కి తగ్గ పరాక్రమ శైలి ని చూపించడం లో ఏమాత్రం ప్రభాస్ తగ్గలేదు అని ఆయన వెల్లడించారు. ఇది ప్రభాస్ అభిమానులను ఎంతగానో సంతోషపడుతుంది. అందరూ సమానమనే భావన ఇది అని దర్శకుడు వెల్లడించారు. మరి ప్రేక్షకులను అలరించడానికి సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఏ స్థాయిలో ఈ సినిమా పరిశ్రమ స్థాయిని మారుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: