రణబీర్ కపూర్ మరియు ఆలియా భట్ గత కొంత కాలంగా ప్రేమలో ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే.అయితే ఈ బాలీవుడ్ జంట రణ్‌బీర్ కపూర్, ఆలియాభట్ త్వరలోనే పెళ్ళీ పీటలు ఎక్కబోతున్నట్లు గత రెండు మూడు రోజుల నుంచి వార్తలు వస్తున్నవి మనమందరం చూస్తూనే ఉన్నాం.ఇదిలావుండగా ఇప్పటికే ఈ స్టార్లు ఇద్దరు ఇంట్లో పెళ్ళి పనులు మొదలయ్యాయని సమాచారం వినిపిస్తోంది. అయితే వీళ్ళ వివాహ వేడుక ముంబైలో చెంబూరిలోని ఆర్‌కే ఇంట్లో ఘనంగా జరుగనున్నట్లు తెలుస్తుంది. ఇక అసలు విషయంలోకి వెళితే ఈ పెళ్ళికి అత్యంత సన్నిహితులు మాత్రమే రానున్నారట.

అయితే ఈ క్రమంలో రణ్‌బీర్‌ బ్యాచ్‌లర్ పార్టీ నిర్వహించబోతున్నట్లు సమాచారం.ఇకపోతే ముంబైలో జరగనున్న ఈ బ్యాచ్‌లర్ పార్టీకి అర్జున్ కపూర్‌, ఆదిత్యా రాయ్‌ కపూర్‌, మరియు అయాన్ ముఖర్జీ ముఖ్య అతిథిలుగా రానున్నారని సమాచారం వినిపిస్తోంది .అయితే ఇక రణ్‌బీర్, ఆలియా కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్నారు. ఇకపోతే అలియా త్వరలోనే తన హాలీవుడ్ డెబ్యూ ‘హార్ట్ ఆఫ్ స్టొన్’ కోసం యూఎస్ వెళ్ళనుంది. ఇదిలావుండగా ప్రస్తుతం ఈమె రణ్‌బీర్‌తో కలిసి నటించిన ‘బ్రహ్మస్త్ర’ పోస్ట్ ప్రోడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక దీంతో పాటుగా ఆలియా స్వీయ నిర్మాణంలో నటించిన ‘డార్లింగ్’ విడుదలకు సిద్ధంగా ఉంది.

ఇకపోతే  ‘రాఖి ఔర్ రాణికి ప్రేమ్ కహాని’ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. కీతే ఇక  రణ్‌బీర్ నటించిన ‘షంషేర’ విడుదలకు సిద్ధంగా ఉంది. కాగా సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కునన్న ‘యానిమల్’ ప్రీ ప్రోడక్షన్ పనులలో బిజీగా ఉంది. ఇక ఆలియాభట్ సినిమాల విషయానికొస్తే మొన్నటి వరకు త్రిబుల్ ఆర్ సినిమాతో బిజీగా ఉన్న ఈమె ఆర్ ఆర్ ఆర్ ఈ సినిమాతో ఘన విజయాన్ని అందుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ప్రస్తుతం ఈ ఇద్దరూ జంటగా 'బ్రహ్మాస్త్ర' అనే సినిమాలో నటించారు. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ సినిమా వేసవి కానుకగా ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమాలో టాలీవుడ్ సినీ హీరో నాగార్జున కూడా ఓ కీలక పాత్ర పోషించడం విశేషం...!!

మరింత సమాచారం తెలుసుకోండి: