టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఆదిపురుష్'.ఈ సినిమాలో ప్రభాస్ కి జోడీగా బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ అలాగే బాలీవుడ్ స్టార్ సల్మాన్సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ మొదటిసారి రాముడి పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 12న విడుదల చేసినట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. అంతేకాకుండా ఈ సినిమాని 3డి వెర్షన్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలియజేశారు. 

అయితే మొదటి సారి ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తూ ఉండడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. సినిమాను చూసేందుకు ప్రభాస్ ఫాన్స్ అయితే ఎంతో ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్,గ్లిమ్స్ కోసం ఫ్యాన్స్  వెయ్యి కళ్లతో ఎదురు చూడగా.. శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమా దర్శకుడు అభిమానులకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చాడు. శ్రీరామనవమి సందర్భంగా ప్రభాస్ ఫ్యాన్స్ కు స్పెషల్ సర్ప్రైజ్ షేర్ చేశాడు దర్శకుడు ఓం రౌత్. అందులో ఆదిపురుష్ సినిమా స్టార్ట్ చేసిన అప్పటి నుంచి ప్రభాస్ ఫాన్స్ తమ హీరోని రాముడి పాత్రలో ఊహిస్తూ రెడీ చేసిన ఫ్యాన్ మేడ్ పోస్టర్లను..

 అన్నింటినీ కలిపి ఒక వీడియో గా రిలీజ్ చేశాడు. ఇందులో ఆదిపురుష్ విడుదల తేదీని కూడా ప్రకటించాడు. అయితే శ్రీరామనవమి సందర్భంగా ఆదిపురుష్ ఫస్ట్ లుక్ వస్తుందని అనుకున్న అభిమానులకు మాత్రం దర్శకుడు షేర్ చేసిన వీడియో అంతగా సంతృప్తినివ్వలేదు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ దర్శకుడి పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో దర్శకుడిని సోషల్ మీడియా వేదికగా తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇక టి సిరీస్ బ్యానర్పై పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్తో ఈ సినిమా రూపొందుతోంది. ఇక ప్రభాస్ ప్రస్తుతం సలార్, స్పిరిట్, ప్రాజెక్ట్ కే సినిమాలు చేస్తున్నాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: