న్యాచురల్ స్టార్ నాని శ్యామ్ సింగరాయ్ సినిమా తో మొన్నీ మధ్య ప్రేక్షకులను పలకరించాడు..ఆ సినిమా కథ సరికొత్తగా ఉండటంతో జనాలు సినిమాను ఆదరించారు. ఆ సినిమాతో నాని తన హిట్ ట్రాక్ ను మళ్ళీ లైన్లో పెట్టాడు.. ప్రస్తుతం చేతిలో వరుస సినిమాలు ఉన్నాయి. దాంతో నాని బాగా స్పీడ్ మీద వున్నాడు.. ఈ హీరో ఇప్పుడు దసరా సినిమాలో నటిస్తున్నారు.. ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాను కూడా హిట్ అయ్యేలా చేసుకోవాలి అని అనుకున్నాడు. దానిపై ఫోకస్ పెడుతూ షూటింగ్ లో చురుగ్గా ఉంటున్నారు.


డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో నేషనల్ అవార్డు విన్నింగ్ హీరోయిన్ కీర్తిసురేశ్ నానికి జోడిగా నటిస్తుంది. నాని, డైరెక్టర్ శ్రీకాంత్ టీమ్ అంతా సినిమాలొని యాక్షన్ సన్నీవేశాలను తెరకెక్కించే పనిలో నిమగ్నమై వున్నారు.ప్రస్తుతం పెద్దపల్లి జిల్లాలోని గోదావరి ఖని లో షూటింగ్‌తో బిజీగా ఉందని ఇప్పటికే ఓ అప్‌డేట్ బయటకు వచ్చింది..ఆ ప్రాంతం లో ఒక పాటను చిత్రీకరించాలని యోచిస్తున్నట్లు తెలుస్తుంది.కొరియోగ్రఫర్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ నేతృత్వంలో చాలా మంది డ్యాన్సర్లతో ఓ పాటను షూట్ చేస్తున్నారు.



తాజాగా ఓ క్రేజీ న్యూస్ ఇండస్ట్రీ లో చక్కర్లు కోడుతుంది..గోదావరి ఖని ప్రజలు ఇపుడు షాక్ లో ఉన్నారట. చిన్న పట్టణమైన ఆ ప్రాంతంలో ఒక్క ఫంక్షన్ హాల్ కూడా ఖాళీగా లేకపోవడంతో ముక్కున వేలేసుకుంటున్నారట.. అక్కడ షూటింగ్ సందర్భంగా వున్న హాల్స్,హోటల్స్ అన్నీ కూడా సినిమా లోని జూనియర్ ఆర్టిస్ట్ ల కోసం బుక్ అయ్యాయని అంటున్నారు.శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెఱుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోదావరి ఖనిలోని సింగరేణి బొగ్గు గనుల పరిసర ప్రాంతాల పల్లె నేపథ్యంలో షూటింగ్ జరుపుకుంటున్నారని టాక్. ఈ సినిమా తో నాని జనాలను మెప్పిస్తాడా...లేదా అన్నది తెలియాలంటే సినిమా వచ్చేవరకు ఆగాల్సిందె..


మరింత సమాచారం తెలుసుకోండి: