పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా తెలుగు మరియు హిందీ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న సినిమా ఆదిపురుష్.  ఈ చిత్రంతో బాలీవుడ్ సినిమా పరిశ్రమ లోకి ఎంటర్ అవుతున్నాడు ప్రభాస్. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడు గా నటిస్తుండగా సీత పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ కృతిసనన్ కనిపించబోతుంది. లక్ష్మణుడు పాత్రలో సన్నీ సింగ్ ఇక రావణుడి పాత్ర లో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు.

ఐదు వందల కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమా ఇండియా లోని వివిధ ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ముంబయి మరియు హైదరాబాద్ లో ప్రత్యేకంగా వేసిన సెట్స్ లో ఈ సినిమాను తెరకెక్కించగా అవసరం మేరకు విదేశాల్లో సైతం షూటింగ్ చేశారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఈ సినిమాలో సోనాల్ చౌహాన్ కూడా ఓ పాత్రలో నటిస్తున్నట్లు గా ఆమె ఓ న్యూస్ పోర్టల్ కి తెలిపింది. ఇందులో తన పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుందని ఇప్పటివరకు తాను పోషించిన పాత్రలకు పూర్తి భిన్నంగా ఉండబోతుంది అని ఆమె చెబుతుంది.

ఈ సినిమాలో నటించడం సరికొత్త అనుభూతి ని ఇచ్చింది అని ఆమె చెబుతోంది.  ప్రేక్షకులకు ఈ పాత్ర చాలా దగ్గరవుతుంది అని అన్నారు. రామాయణం అందరికీ తెలిసిన పాత్ర కాబట్టి తన పాత్ర సులభంగా అందరికీ చేరువ అవుతుంది అని ఆమె ధీమా వ్యక్తం చేసింది.  ఆమె పాత్ర ఈ సినిమాలో హైలెట్ అవుతుందని ఆమె చెప్పకనే చెప్పింది. మరి ఆమె చేసే పాత్ర ఏంటో తెలియాలి అంటే సినిమా వచ్చేదాకా వేచి చూడాల్సిందే. ఇక ఈ సినిమా తర్వాత సోనాల్ బాలీవుడ్ లో కొన్ని ఆసక్తికరమైన సినిమాలు చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: