మెగా స్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న 152 వ సినిమా "ఆచార్య". మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఇందులో ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా మొత్తానికి అనేక అవాంతరాల తరువాత ఏప్రిల్ 29 వ తేదీన విడుదలకు సిద్ధమైంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో సినిమా బృందం వారు ప్రచార కార్యక్రమాలని ప్రారంభించారు. ఈ మధ్యే ట్రైలర్ తో ఊపు తీసుకొచ్చిన కొరటాల శివ తాజాగా ఈ సినిమా నుంచి మరో పాటకు సంబంధించిన లిరికల్ వీడియోని కూడా విడుదల చేయబోతున్నారు.ఈ పాట ప్రత్యేకత ఏంటంటే చిరంజీవి,చరణ్ ఇద్దరూ కూడా కలిసి 'భలే భలే బంజారా..' అంటూ సాగే పాటలో నటించారు. ఈ సాంగ్ కు తమదైన స్టెప్పులతో ఇరగ్గొట్టేశారట.మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించిన ఈ లిరికల్ వీడియోని ఏప్రిల్ 18న విడుదల చేస్తున్నామని చిత్ర బృందం శనివారం నాడు అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా చిరంజీవి చరణ్ లకు సంబంధించిన ఓ పోస్టర్ ని కూడా విడుదల చేసింది మూవీ టీం. దీంతో పాటు చిరంజీవి చరణ్ లకు సంబంధించిన ఆసక్తికరమైన సంభాషణకు సంబంధించిన వీడియోని కూడా అభిమానులతో పంచుకోవడం జరిగింది.



ఇక జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ నాటు నాటు పాటకు స్టెప్పుటు ఇరగ్గొట్టేశారని ఆ పాటలో రామ్ చరణ్ ని చూశాక తనతో కాలు కదపాలంటే టెన్ష్ మొదలైందన్నట్టుగా చిరంజీవి అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా మేము ఎంత ఇరగ్గొట్టినా ఇంకా ఎంత నాటుగా చేసినా...నాన్న తన గ్రేస్ తో ఎక్స్ప్రెషన్ తో మమ్మల్ని పక్కన పెడతాడని మా డౌట్ అని రామ్ చరణ్ తన భయాన్ని వ్యక్తం చేశాడు. అక్కడే వున్న డైరెక్టర్ కొరటాల శివ చిరు - చరణ్ ల పాట షూటింగ్ సమయంలో జరిగిన ఆసక్తికరమైన సన్నివేశాన్ని గుర్తు చేసుకున్నారు. మాములుగా ఎవరైనా సినిమా టికెట్ ల కోసం జనాలు గోల గోల చేయడం చూశాను కానీ నా కెరీర్ లో ఫస్ట్ టైమ్ ఈ పాటని షూట్ చేస్తుంటే లైవ్ లో చూడాలని చాలా మంది ఫోన్ లు చేసి సెట్ కు వస్తామని అడిగారని కొరటాల శివ గుర్తు చేసుకున్నారు. ఇక దీన్ని బట్టి ఈ పాటతో పూనకాలు రావడం ఖాయంలా అనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: