నాచురల్ స్టార్ హీరో నాని ప్రస్తుతం వరుసగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఉన్నారు. అందులో ఒకటి సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంటోంది. మరొకటి ఇటీవల సెట్స్ మీదికి వెళ్లడం జరిగింది. ప్రస్తుతం నాని నటించిన అంటే సుందరానికి చిత్రం షూటింగ్ పూర్తి అయినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాకి డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించారు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు ఈ సినిమాని నిర్మించడం జరుగుతోంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చాలా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని జూన్ 10 తేదీన విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు గా సమాచారం.


ఇందులో మలయాళం బ్యూటీ నజ్రియా నజీమ్ కథానాయికగా నటిస్తోంది. ఇక ఈమెకు ఇదే తెలుగులో మొట్టమొదటి సినిమా అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా విడుదలకు దాదాపుగా రెండు మాసాలు సమయం ఉంది. ఇప్పుడే ప్రమోషన్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కూడా జరిగింది. ఇటీవలే పంచ కట్టు అనే ఒక లిరికల్ వీడియో ను కూడా విడుదల చేయడం జరిగింది. ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించారు.


ఇదిలా ఉండగా ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన దర్శకుడు వివేక్ ఆత్రేయ కొన్ని విషయాలు తెలియజేశారు. మొదటిసారిగా హీరో నానికి కథ వినిపించాను.. ఆ సమయంలో నా మైండ్లో ఫస్టాఫ్ మాత్రమే ఉన్నది.. అదే ఆయనకు వినిపించాను ఆ చిత్రం చాలా ఆసక్తిగా ఉందని చేస్తాం అని ఎంతో హుషారుగా తెలియజేశారట. ఇక ఆ తరువాత మూడు వారాలకు సెకండ్ పార్ట్ ను  కూడా వినిపించాను. కథ నచ్చడంతో ఓకే చెప్పేసారు అని తెలియజేశారు. ఇక ఇందులో కథానాయికగా నజ్రియా అయితే బాగుంటుందని నాని,  డైరెక్టర్ అనుకున్నారట. అయితే నజ్రియాకు కథ చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా చెప్పామని డైరెక్టర్ని హెచ్చరించారట నాని. అంతేకాకుండా తన కథ చెప్పేటప్పుడు తనకు చెప్పిన విధంగా చెప్పకుండా ప్లెయిన్ గా చెప్పమన్నారట. దీంతో ఆమెకు కథ నచ్చడంతో ఓకే చెప్పిందని తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: