తెలుగులో హిరోయిన్ సమంత కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యెకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎం మాయ చెసావె సినిమా తో వెండి తెర ప్రెక్షకులను పలకరించిన అమ్మడు..ఆ సినిమా ఘన విజయాన్ని అందుకోవడంతో స్టార్ హీరోయిన్ అయ్యింది. ఒకవైపు సినిమాలు, మరో వైపు యాడ్ లు చేస్తూ బిజిగా ఉన్న సంగతి తెలిసిందే.. ఇక పోతే హీరో నాగచైతన్య తో పెళ్ళి చేసుకుంది. కొన్నేళ్లు కాపురం చేసిన వీళ్ళు మనస్పర్థలు కారణంగా విడాకులు తీసుకున్నారు.. అప్పటి నుంచి అమ్మడు అనుకున్న విధంగా సినిమాలు చేసుకుంటూ వస్తుంది.


ఇటీవల విడుదల అయ్యి భారీ ఘన విజయాన్ని అందుకున్న పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ ను చేసింది. ఆ సాంగ్ ఎంత హిట్ అయ్యిందో ప్రత్యెకంగా చెప్పాల్సిన పనిలేదు. అమ్మాయిగారి క్రేజ్ పదింతలు అయ్యింది. ఇక అమ్మడు సినిమా స్పీడ్ ను కూడా పెంచేసింది.ఇలా సామ్ ఇప్పుడు భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్ల జాబితాలోకి చేరింది.. కేవలం తెలుగు మాత్రమే కాదు ఇతర భాషల్లో కూడా సినిమా అవకాశాలను అందుకుంటు దూసుకుపోతుంది..


తమిళంలో ''కాతు వాకుల రెండు కాదల్'' అనే సినిమాను విజయ్ సేతుపతి, నయనతారల తో కలిసి పూర్తి చేసిన సామ్, ఈ సినిమాను రిలీజ్ కు రెడీ చేసింది. అయితే తెలుగు లో ఆమె దర్శకుడు గుణశేఖర్ డైరెక్షన్ లో 'శాకుంతలం' అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే..ఆ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తీ చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. కాగా తాజాగా ఈ సినిమాలోని తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పనులను పూర్తి చేసినట్లు సమంత తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.శాకుంతలం చిత్రాన్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారనే విషయంపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వాల్సి వుంది.. ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి..




మరింత సమాచారం తెలుసుకోండి: