మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. ఆయన సినిమాలలో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది అనే విషయంపై ఎక్కడ క్లారిటీ లేకుండా ఉంటోంది. నిన్నటి వరకు గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ లో పాల్గొన్న చిరంజీవి ఆ తర్వాత బోళా శంకర్  వంటి సినిమా షూటింగ్లో కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. చిరంజీవి చేస్తున్న మూడు సినిమాలలో ఏ సినిమా షూటింగ్ ఎప్పుడు ఎలా మొదలవుతుందో అనే విషయం ఎవరికీ అర్థం కాలేదు.

ఇక  ఇటువంటి సమయంలోనే చిరంజీవి చేస్తున్న వాల్తేరు వీరన్న సినిమా షూటింగ్ కూడా జరగబోతోందని శృతిహాసన్ తన ఇంస్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది. ప్రస్తుతం శృతి హాసన్ చిరంజీవి 154 వ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నట్లు గా తెలియజేయడం జరిగింది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ బాబీ రూపొందిస్తున్నారు. అయితే ఈ చిత్రం టైటిల్ ని వాల్తేరు వీరన్న కాకుండా మరొక టైటిల్ పెట్టే ఆలోచన కూడా ఉన్నట్లు సమాచారం. అయితే ఇందులో కథానాయికగా మాత్రం శ్రుతి హాసన్. ఇక ఈమె గతంలో కూడా చిరంజీవితో కలిసి కొన్ని సన్నివేశాలలో పాల్గొన్నది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి మరొక షెడ్యూల్లో కూడా పాల్గొనేందుకు సిద్ధం అయింది ఈ ముద్దుగుమ్మ.చిరంజీవి ఒకవైపు ఆచార్య సినిమా షూటింగ్ లో బిజీగా ఉండంగానే మరొకవైపు డైరెక్టర్ బాబీ సినిమా చేయబోతున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి లుక్ చాలా విభిన్నంగా ఉండబోతోందని అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. శృతిహాసన్ తో చిరంజీవి మొదటి సారి రొమాన్స్ చేయడానికి సిద్ధమయ్యారు. దీంతో ఈ చిత్రం చాలా విభిన్నంగా ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. కరోనా, శృతిహాసన్ తన ప్రియుడు శాంతను ఇంట వేడుకలు కారణంగా కొన్ని రోజుల పాడు షూటింగులకు దూరంగా ఉన్నది. ఇక ఇలా చిరంజీవి, బాలకృష్ణ, ప్రభాస్ వంటి వారితో సినిమాలు షూటింగ్ లో బిజీగా ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: