ప్రస్తుతం మెగాభిమానులు మరియు సినీ ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం ఆచార్య .ఇకపోతే ఈ సినిమాలో మెగాస్టార్‌ చిరంజీవి తో పాటు ఆయన తనయుడు మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ ను మరోసారి జంటగా స్ర్కీన్‌పై చూసేందుకు అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు.అంతేకాదు కొరటాల శివ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో కాజల్‌ మరియు పూజాహెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మెగా మూవీ ఈనెల 29న గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. ఇకపోతే విడుదల తేదీకి సమయం దగ్గర పడుతుండడంతో ప్రమోషన్‌ కార్యక్రమాలను వేగవంతం చేసింది చిత్రబృందం.

అయితే ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్‏కు సూపర్బ్‌ రెస్పాన్స్ రాగా ..ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుంచి భలే భలే బంజారా పాటను విడుదల చేసింది చిత్రయూనిట్. ఇదిలావుండగా ప్రస్తుతం ఈ పాట కూడా యూట్యూబ్‌ రికార్డులను దున్నేస్తోంది. ఇకపోతే  ఆచార్య సినిమా రన్‌ టైం  కూడా లాక్‌ అయిందని సమాచారం.అంతేకాకుండా 166 నిమిషాలు అంటే 2 గంటల 46 నిమిషాల పాటు ఈ సినిమా ఉంటుందట.ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో మాట్లాడిన డైరెక్టర్‌ కొరటాల శివ ఈ స్టోరీ పెద్దదని చెప్పకనే చెప్పారు.కాగా  అందుకు తగ్గట్టుగానే సుమారు 166 నిమిషాల రన్‌ టైం ఫిక్స్‌ చేశారని తెలుస్తోంది.

అయితే  కొరటాల గత చిత్రాలు జనతా గ్యారేజ్, శ్రీమంతుడు, భరత్ అనే నేను సినిమాల రన్ టైమ్ కూడా 170 నిమిషాల వరకు ఉంది.అయితే  ఇవి సూపర్‌ డూపర్‌ హిట్లుగా నిలిచాయి. ఇకపోతే  ధర్మస్థలి నేపథ్యానికి నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌ను జోడించి ఆచార్య సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.ఇక  శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. అంతేకాకుండా ఏప్రిల్ 23న ఆచార్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: