ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ తన డాన్స్ తో ఈ ఎంత మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడో మనందరికీ తెలుసు.ఇకపోతే ఈయన  కొరియోగ్రాఫర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నప్పటికీ ఈయన పెద్దగా ఎవరికి తెలియలేదు.అయితే శేఖర్ మాస్టర్ ను ప్రేక్షకులకు చాలా దగ్గరగా పరిచయం చేసింది మాత్రం మల్లెమాల సంస్థ అని చెప్పవచ్చు. ఇకపోతే మల్లెమాల వారు నిర్వహిస్తున్న ఢీ డాన్స్ షో ద్వారా శేఖర్ మాస్టర్ కంటెస్టెంట్ గా పరిచయం అయి తిరిగి అదే కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా ఎదిగారు. ఇక ఇలా  ఎన్నో సీజన్లకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించిన శేఖర్ మాస్టర్ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు.

అయితే ఇలా డాన్స్ షో కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ మంచి ఆదరణ దక్కించుకున్న శేఖర్ మాస్టర్ ఉన్నఫలంగా ఈ కార్యక్రమం నుంచి దూరమయ్యారు.ఇకపోతే ఈ విధంగా ఈ కార్యక్రమం నుంచి వెళ్లి పోవడానికి గల కారణాలు ఏమిటి అనే విషయం గురించి గతంలో ఎన్నోసార్లు వివరణ ఇచ్చారు. అయితే సినిమాలతో బిజీ కావడం వల్లే ఆ కార్యక్రమానికి రాలేకపోతున్నానని, డేట్స్ అడ్జస్ట్ కాలేకపోతున్నాయి అంటూ కారణాలు చెప్పుకొచ్చారు.  శేఖర్ మాస్టర్ ఎన్నో కారణాలు చెప్పినప్పటికీ తాజాగా మరోసారి ఈ విషయంపై స్పందించారు.అయితే ఈ సందర్భంగా శేఖర్ మాస్టర్ స్పందిస్తూ ఢీ నుంచితాను వెళ్లిపోవడానికి పెద్ద కారణాలు ఏమీ లేవు.

ఇక  కేవలం అగ్రిమెంట్ కారణంగానే ఈ కార్యక్రమం నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చారు.అంతేకాదు ఢీలో ఉన్నప్పుడే కామెడీ స్టార్స్ కార్యక్రమానికి అగ్రిమెంట్ ఇచ్చాను.ఇక  ఆ కారణంతోనే ఢీ వదిలి రావాల్సి వచ్చింది.ఇకపోతే ఈ అగ్రిమెంట్ పూర్తికాగానే తిరిగి మల్లెమాల వారు పిలిస్తే తప్పకుండా ఆ కార్యక్రమానికి వెళ్తానని శేఖర్ మాస్టర్ వెల్లడించారు. అంతేకాకుండా మల్లెమాల నాకు పుట్టిల్లు వంటిది నన్ను ఇంత మందికి దగ్గర చేసిన మల్లెమాల, మరియు ఢీ షో అంటే ఎప్పటికీ నాకు గౌరవమే అంటూ శేఖర్ మాస్టర్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: