కే జి ఎఫ్ 2 ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ సినిమా పేరు వినిపిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఇంతలా విజయం సాధించడం వెనుక ఉన్న వ్యక్తి హీరో యశ్ మాత్రమే కాదు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా.. కే జి ఎఫ్ సినిమా తో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈయన పేరు వినిపిస్తూ ఉండడం గమనార్హం. అంతేకాదు భారీ సినిమాల దర్శకుల జాబితాలో ఆయన పేరు కూడా చేరిపోయింది. ఇక యాక్షన్, ఎమోషన్స్ ని తన సినిమాల్లో అద్భుతంగా ఆవిష్కరించగల కెపాసిటీ ఉన్న దర్శకులలో ప్రశాంత్ నీల్ పేరు వినిపించడం గమనార్హం. ఇకపోతే దర్శకుడు ఎవరు అనేది చూసి ప్రేక్షకులు థియేటర్లకు వెళ్తూ ఉంటారు. అయితే ఇది కేవలం కొంతమంది దర్శకులకి మాత్రమే ఇలా జరుగుతూ ఉంటుంది. అలాంటి దర్శకుల జాబితాలో ప్రశాంత్ కూడా చేరిపోయాడు.


సినీ ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయేలా కన్నడ సినిమాల బడ్జెట్, కథలు, విడుదల విషయంలో వాటి పరిధి చాలా తక్కువ అనుకున్న వారు ఆశ్చర్యపోయేలా కన్నడ సినిమా స్థాయిని దేశవ్యాప్తంగా పెంచేశారు. అందుకే కన్నడ సినీ పరిశ్రమలో ఈయన గురించి గొప్పగా చెప్పుకోని వారంటూ ఎవరూ ఉండరు. విమర్శకులు సైతం ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇకపోతే తాజాగా వారంతా ప్రశాంత్ నీల్ విషయంలో కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో ఎన్టీఆర్, మహేష్బాబుల గురించి ప్రస్తావిస్తూ ఉండడంతో కన్నడ సినీ ప్రేక్షకులు కొంచెం నిరాశ వ్యక్తం చేస్తున్నట్లు గమనార్హం.


ఇకపోతే ప్రశాంత్ నీల్ తాజాగా ప్రభాస్ తో సలార్ మూవీ  చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత ఎన్టీఆర్ తో కానీ మహేష్ బాబుతో కానీ సినిమా చేయవచ్చనే ప్రచారం బాగా జరుగుతోంది. కన్నడ ఇండస్ట్రీ తో పోల్చుకుంటే తెలుగు ఇండస్ట్రీ చాలా పెద్దది. అంతేకాదు తెలుగు సినీ ఇండస్ట్రీలో వచ్చే స్థాయి, డబ్బు రెట్టింపు స్థాయిలోనే ఉంటాయి. అందుకే ప్రశాంత్ కన్నడ స్టార్స్ కి దూరంగా ఉంటూ తెలుగు స్టార్లకు దగ్గర అవుతున్నాడని అందరూ చెప్పుకుంటున్నారు. అయితే ఈ విషయంపై ఆయన స్పందిస్తూ కన్నడ ఇండస్ట్రీ అంటే గౌరవం చాలా ఉంది .అలాగే తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోలు ఇచ్చే మర్యాద కూడా నాకు చాలా బాగా నచ్చింది . అంతేకాదు కథలను బట్టి స్టార్లను ఎంచుకుంటాను అని తెలిపాడు ప్రశాంత్.

మరింత సమాచారం తెలుసుకోండి: