పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తాజాగా నటించిన చిత్రం రాధేశ్యాం.ఈ సినిమా కరోనా కారణంగా అనేక వాయిదాల అనంతరం ఈ చిత్రం మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. అయితే ఈ చిత్రానికి మిక్స్ డ్‌ టాక్‌ వచ్చింది.ఇకపోతే  `బాహుబలి`, `సాహో` వంటి భారీ యాక్షన్‌ సినిమాలు చేసిన ప్రభాస్‌ని `రాధేశ్యామ్‌` వంటి లవ్‌ స్టోరీ చిత్రంలో ఆడియెన్స్ చూడలేకపోయారు.అయితే ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. ఇక ఈ ఏజ్‌లో, ఈ టైమ్‌లో ప్రభాస్‌ లవ్‌ స్టోరీ చేయడం కరెక్ట్ కాదని, దాన్ని ఫ్యాన్స్ సైతం రిసీవ్‌ చేసుకోలేకపోయారనే టాక్‌ వినిపించింది.

అంతేకాదు పైగా భారీ బడ్జెట్‌ పెట్టడం కూడా ఈ చిత్రానికి పెద్ద మైనస్‌.ఇక  వంద కోట్ల లోపు బడ్జెట్‌తో తీస్తే వర్కౌట్‌ అయ్యేది ఎందుకంటే. కాగా ఈ చిత్రం ఓవరాల్‌గా రెండు వందలకుపైగా కలెక్షన్లని రాబట్టింది. అయితే అదే వంద కోట్ల లోపు బడ్జెట్‌తో తీస్తే పెద్ద హిట్‌గానూ నిలిచేది. ఇకపోతే  ప్రభాస్‌ పారితోషికం కూడా పెద్ద మైనస్‌గా చెప్పొచ్చు. కాగా మొత్తానికి ఈ చిత్రం డిజాస్టర్‌ జాబితాలో చేరిపోయింది.ఇకపోతే తాజాగా ఈ చిత్రంపై ప్రభాస్‌ ఫస్ట్ టైమ్‌ స్పందించారు.అయితే  `రాధేశ్యామ్‌` ఫెయిల్‌కి కారణమేంటో విశ్లేషించారు. ఇక ఈ చిత్ర రిలీజ్‌ టైమ్‌కి కరోనా వ్యాప్తి ఇంకా పూర్తిగా తగ్గకపోవడమే కారణం అనుకుంటున్నట్టు తెలిపారు.

ఇకపోతే  ప్రేమ కథల్లో తనని ఆడియెన్స్ ఇష్టపడి ఉండకపోవచ్చు అని, లేక స్క్రిప్ట్ లోనే లోపం కూడా ఉండవచ్చు అని తెలిపారు.అయితే  మొత్తంగా సినిమా ఫెయిల్‌ని ఆయన అంగీకరించారు.అంతేకాదు తనకు `బాహుబలి` లాంటి సినిమాలు చేయడం ఇష్టమే అని, అలాగని ఎప్పుడూ అలాంటి సినిమాల్లో నటిస్తే నటుడిగా కొత్తదనం చూడలేనని తెలిపారు. అయితే వైవిధ్యమైన, విభిన్నమైన సినిమాలు చూడాలనుకుంటున్నట్టు చెప్పారు ప్రభాస్‌.ఇదిలావుంటే  ప్రస్తుతం ఆయన `సలార్‌`, `ఆదిపురుష్‌`, `ప్రాజెక్ట్ కే` చిత్రాల్లో నటిస్తున్నారు. అయితే మారుతి దర్శకత్వంలో ఓ సినిమా, సందీప్‌రెడ్డి వంగా డైరెక్షన్‌లో మరో సినిమా చేయబోతున్నారు. ఇక భారీ సినిమాల లైనప్‌తో మరో మూడేళ్లు బిజీగా ఉన్నారు డార్లింగ్‌...!!

మరింత సమాచారం తెలుసుకోండి: