పుష్ప సినిమాతో ఘన విజయాన్ని అందుకొని ఇప్పుడు దేశంలోనే మోస్ట్ వాంటెడ్ దర్శకుడిగా ఎదిగాడు సుకుమార్.  ఆ సినిమాను తెరకెక్కించిన విధానానికి ప్రపంచం మొత్తం ఫిదా అయింది. ఈ సినిమా యొక్క ప్లాట్ అందరిని ఎంతో బాగా మెప్పించింది. ఆ విధంగా పోయిన ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా ఆ సమయంలో చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. సెలబ్రిటీలు సైతం ఈ సినిమాలోని మేనరిజమ్స్ చేస్తూ ఈ సినిమా యొక్క క్రేజ్ ను అందరికీ తెలియజేశారు.

ఆ విధంగా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా యొక్క రెండవ భాగం తప్పకుండా భారీ విజయాన్ని అందుకుంటుందని అందరూ భావిస్తున్నారు. ఆ అంచనాలకు తగ్గట్లగా దర్శకుడు సుకుమార్సినిమా యొక్క కథ ను ఇంకా బాగా రూపొందించేలా చేస్తున్నాడని అంటున్నారు. అంతకుముందు ఈ రెండు భాగాలకు సంబంధించిన కథ బాగానే రూపొందించిన కూడా ఇప్పుడు పెరిగిన అంచనాల దృష్ట్యా ఈ సినిమాను మరింత బాగా చేయాలని చెప్పి ఎక్కువ సమయం తీసుకుంటున్నారు సుక్కు. 

అలా షూటింగ్ తేదీ ను జరుపుతూ వచ్చి జూలై నెలలో ఈ సినిమాను సెట్స్ మీదకు వెళ్ళాలి అని ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పు డు ఆగస్టు నెల లో కి షూటింగ్ వెళ్ళిపోతది అన్నట్లుగా పరిస్థితి నెలకొంది. దానికి కారణం ఈ సినిమా స్క్రిప్ట్ పనులు పూర్తి కాక పోవడం అని తెలిసింది.  ఈ నేపథ్యంలో సుకుమార్ మరో నెలలు ఈ స్క్రిప్ట్ పై కూర్చుని ఎలాంటి పుట్ తీసుకొస్తాడో చూడాలి. అల్లు అర్జున్ మరియు రష్మిక జంటగా నటిస్తున్న ఈ సినిమా ఏ స్థాయిలో ఉంటుందో తెలియాలంటే ఈ సినిమా విడుదల వరకు ఆగాల్సిందే. వచ్చే ఏడాది ఈ సినిమా ను విడుదల చేయాలని భావిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: