మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్‌లో సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన తాజా సినిమా ఆచార్య.అయితే రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముహూర్తాన్ని ఖరారు చేశారు. అయితే ఈ నెల 23వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో నిర్వహించనున్నారు. ఇకపోతే కొంతసేపటి క్రితం అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను వదిలారు. కాగా ఆ రోజున సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక మొదలుకానుంది.అయితే ఇక కొరటాల శివ రూపొందించిన ఆచార్య సినిమా సెన్సారు ఫార్మాలిటీలు పూర్తయ్యాయి.

కాగా  ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు . అయితే టాలీవుడ్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఆచార్య సినిమా మెగా ఫ్యాన్స్ కు నచ్చేలా వుంటుంది. ఇకపోతే అచ్చం మెగాస్టార్ చిరంజీవి సినిమాలా ఉంటుందట.కాగా  కొరటాల శివ కథ, కథనాలకు ఓ స్టయిల్ వుంటుంది. ఇక చిరంజీవి ఫార్మాట్ వేరుగా ఉంటుంది.ఇకపోతే ఆచార్య సినిమా మెగాస్టార్ ఫార్మాట్ కు దగ్గరగా ఉంటుందని సమాచారం. అయితే సినిమాలో ఇంట్రవెల్ బ్యాంగ్, క్లయిమాక్స్ ఇంట్రస్టింగ్ మలిచారని టాక్. అంతే కాదు సినిమా తొలిసగం కన్నా మలిసగానికి ఎక్కువ మార్కులు పడతాయట. ఇకపోతే సినిమా మొత్తం అడవి నేపథ్యంలోనే వుంటుంది.

ఇక సినిమా మొత్తం మీద మెగాస్టార్ కన్నా రామ్ చరణ్ నటనకే ఫ్యాన్స్ ఫిదా అవుతారని టాక్. అంతేకాదు రామ్ చరణ్ తొలిసగంలో కనిపించరు. ఇక ఈ సినిమా ప్రేక్షకులని ఫుల్‌గా ఎంటర్‌టైన్ చేయనుందని అంటున్నారు.కాగా ఆచార్య సినిమాకు సంబంధించిన టీజర్లు, ట్రైలర్లు, పాటలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేయడంతో బిజినెస్ వర్గాల భారీగా క్యూరియాసిటీ పెరిగింది.అయితే  సైరా తర్వాత చిరంజీవి నటించిన చిత్రం కావడంతో మరింత అంచనాలు పెరిగాయి. ఇదిలావుండగా  ఇటీవల తండ్రీకొడుకుల కాంబో పాట సినిమాపై మరింత క్రేజ్‌ను పెంచింది. ఇక దాంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 133 కోట్ల మేర జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: