ఇప్పుడు మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాలో నటిస్తూన్నారు. ఆ సినిమా మొదలై చాలా రోజులు అయ్యింది.ఈ మూవీ షూటింగ్ పూర్తయినట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. పరశురామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మహానటి ఫెమ్ కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే.. మహేష్ కాలికి సర్జరీ కావడం తో షూటింగ్ కు రెండు నెలలు గ్యాప్ తీసుకున్నారు.. మే 12 ను సినిమాను విడుదల చేయాలనీ ఎప్పుడో చిత్రయూనిట్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే..దాంతో షూటింగ్ ను శర వేగంగా పూర్తీ చేశారు మేకర్స్..
చివరిగా హైదరాబాద్లోని ప్రముఖ స్టూడియోలో ఓ పాట చిత్రీకరణతో సర్కారు వారి పాట షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఈ పాటలో మహేశ్బాబు, కీర్తీ సురేశ్లు స్టెప్పులేశారు. ఇక పాట చిత్రీకరణ పూర్తికాగానే చిత్రానికి ముగింపు పలికారు. నిన్న ఈ సినిమా చివరి షెడ్యూల్ ను పూర్తీ చేశారు.మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ''సర్కారు వారి పాట' మూవీ షూటింగ్ పూర్తి చేశారు..ఈ మేరకు మూవీలోని మరో లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేశారు.. ఆ పోస్టర్ సినిమా పై అంచనాలను క్రియేట్ చెస్తుంది.. మొత్తానికి సినిమా బాక్సాఫిస్ రికార్దుల సునామికి రెడీ అవుతుందని తెలుస్తుంది.