పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లైగర్ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో ఉన్న ఈ చిత్రాన్ని ఆగస్టు 25వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే వెల్లడించగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ ను విడుదల చేసి దేశవ్యాప్తంగా ఈ చిత్రం యొక్క క్రేజ్ ను ఇంకా పెంచారు. ఇంకా చాలా రోజుల తర్వాత పూరి జగన్నాథ్ ఈ స్థాయిలో సినిమా చేస్తూ ఉండటం విశేషం. అంతకు ముందు ఇష్మార్ట్ శంకర్ తో మంచి విజయాన్ని అందుకున్న ఈ దర్శకుడు ఇప్పుడు అదే జోరు కొనసాగిస్తూ ఈ సినిమాను రూపొందించాడు.

భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించడం మరింత విశేషం. కాగా విజయ్ దేవరకొండ లాంటి హీరో తో భారీ బడ్జెట్ సినిమా చేయడం కత్తి మీద సాము లాంటిదే అని చెప్పాలి. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా పరిశ్రమలోకి వచ్చి ఈ స్థాయికి ఎదిగాడు విజయ్ దేవరకొండ. ఈ నేపథ్యంలో ఎన్నో విశేషాలను కలిగిన ఈ సినిమా కోసం విజయ్ నీ తీసుకువచ్చిన పూరి జగన్నాథ్ విడుదల విషయంలోనో ఏమాత్రం కాంప్రమైజ్ అవకుండా తన సినిమాను ప్రమోట్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నాడు. బాలీవుడ్లో ఈ చిత్రాన్ని పూర్తిగా నిర్మించిన నేపథ్యంలో అక్కడ ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ తన సినిమా ప్రమోట్ చేయనున్నాడు. 

సినిమా తర్వాత కూడా వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా రాబోతోంది. ఈ చిత్రాన్ని తప్పకుండా మంచి హిట్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే పూరి జగన్నాథ్ ఈ సినిమాని విడుదల చేసే విషయంలో ఏ విధంగానూ కాంప్రమైజ్ కావడం లేదు. బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ ఓ కీలక పాత్రలో నటిస్తుండగా హాలీవుడ్ నటుడు బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ ఆ పాత్రను ఈ సినిమాలో చేయబోతున్నాడు. ఆ విధంగా ఈ సినిమా కోసం పూరి జగన్నాథ్ గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ప్రణాళికను రూపొందించి ఇప్పుడు విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: