దర్శక ధీరుడు
రాజమౌళి ఆర్ ఆర్ ఆర్
సినిమా తర్వాత మహేష్ బాబుతో
సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం సర్కారు వారి పాట
సినిమా చేస్తున్న మహేష్ ఆ తర్వాత
త్రివిక్రమ్ తో
సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రం పూర్తి కావడానికి ఈ ఏడాది సమయం పడుతుంది. ఆ తర్వాత
రాజమౌళి సినిమా చేయాలని ఫిక్స్ అయిపోయాడు మహేష్. ఈలోపు
జక్కన్న విశ్రాంతి తీసుకోవాలని భావించాడు కానీ రాజమౌళికి ఇప్పుడు ఈ గ్యాప్ లో ఓ
సినిమా చేయాలనే కోరిక పుట్టింది.
రాజమౌళి
సినిమా అంటే సంవత్సరాలకు సంవత్సరాలు టైం పడుతుంది. అలా కాకుండా ఈసారి ఓ లేడీ ఓరియెంటెడ్
సినిమా చేసే విధంగా ఆయన ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు. ఇదే కనుక నిజమైతే ఈ సినిమాలో నటించే అవకాశం ఏ
హీరోయిన్ కు దక్కుతుందో చూడాలి. తప్పకుండా ఆ
హీరోయిన్ కు మంచి పాపులారిటీ అయితే వస్తుంది అని చెప్పవచ్చు. ఒక భారీ
సినిమా చేసిన తర్వాత చిన్న
సినిమా చేయడం రాజమౌళికి అలవాటు. అలా అలా
మర్యాద రామన్న ఈగ వంటి సినిమాలను చేసిన ఈ దర్శకుడు ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్
సినిమా తర్వాత చిన్న
సినిమా చేయడానికి ముందుకు రావడం విశేషం.
సర్కారు వారి పాట
సినిమా ను మే 12వ తేదీన విడుదల చేయడానికి అన్ని సిద్ధం చేస్తున్నాడు మహేష్. ఇప్పటికే ఈ
సినిమా షూటింగ్ ను కూడా పూర్తి చేశాడు. పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుతున్నాడు. ప్రమోషన్ కార్యక్రమాలను కూడా చేయడానికి అన్ని సిద్ధం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే
త్రివిక్రమ్ దర్శకత్వంలోని
సినిమా ను
జూన్ లో మొదలుపెట్టి
డిసెంబర్ నాటికి పూర్తి చేసి వచ్చే ఏడాది జనవరిలో మహేష్
రాజమౌళి ఈ సినిమాను మొదలు పెట్టాలని చూస్తున్నాడు. ఈ విధంగా మహేష్ ప్లాన్ ఉంటే ఈ గ్యాప్ లేడీ ఓరియంటెడ్
సినిమా చేసి విడుదల చేయాలి అని
రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడు. ఇది ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.