దర్శక ధీరుడు రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత మహేష్ బాబుతో సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.  ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్న మహేష్ ఆ తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రం పూర్తి కావడానికి ఈ ఏడాది సమయం పడుతుంది. ఆ తర్వాత రాజమౌళి సినిమా చేయాలని ఫిక్స్ అయిపోయాడు మహేష్. ఈలోపు జక్కన్న విశ్రాంతి తీసుకోవాలని భావించాడు కానీ రాజమౌళికి ఇప్పుడు ఈ గ్యాప్ లో ఓ సినిమా చేయాలనే కోరిక పుట్టింది.

రాజమౌళి సినిమా అంటే సంవత్సరాలకు సంవత్సరాలు టైం పడుతుంది. అలా కాకుండా ఈసారి ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేసే విధంగా ఆయన ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు. ఇదే కనుక నిజమైతే ఈ సినిమాలో నటించే అవకాశం ఏ హీరోయిన్ కు దక్కుతుందో చూడాలి. తప్పకుండా ఆ హీరోయిన్ కు మంచి పాపులారిటీ అయితే వస్తుంది అని చెప్పవచ్చు. ఒక భారీ సినిమా చేసిన తర్వాత చిన్న సినిమా చేయడం రాజమౌళికి అలవాటు. అలా అలా మర్యాద రామన్న ఈగ వంటి సినిమాలను చేసిన ఈ దర్శకుడు ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత చిన్న సినిమా చేయడానికి ముందుకు రావడం విశేషం.

సర్కారు వారి పాట సినిమా ను మే 12వ తేదీన విడుదల చేయడానికి అన్ని సిద్ధం చేస్తున్నాడు మహేష్. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ను కూడా పూర్తి చేశాడు. పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుతున్నాడు. ప్రమోషన్ కార్యక్రమాలను కూడా చేయడానికి అన్ని సిద్ధం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే త్రివిక్రమ్ దర్శకత్వంలోని సినిమా ను జూన్ లో మొదలుపెట్టి డిసెంబర్ నాటికి పూర్తి చేసి వచ్చే ఏడాది జనవరిలో మహేష్ రాజమౌళి ఈ సినిమాను మొదలు పెట్టాలని చూస్తున్నాడు. ఈ విధంగా మహేష్ ప్లాన్ ఉంటే ఈ గ్యాప్ లేడీ ఓరియంటెడ్ సినిమా చేసి విడుదల చేయాలి అని రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడు.  ఇది ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: