ఫిలిం ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ స్థాయికి ఎదగాలి అంటే నటనతో గ్లామర్ ఎక్స్ పోజింగ్ కూడ చాల అవసరం. చిన్నతనం నుండే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఫిలిం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ మొదటి నుండి నటనకు అవకాశం ఉన్న పాత్రలను మాత్రమే ఎంచుకుంటోంది. కేవలం పారితోషికం దృష్టిలో పెట్టుకుని ఆమె సినిమాలు ఒప్పుకోడు. ఒకవేళ ఆమె ఒప్పుకున్నా సినిమాలు ఫెయిల్ అయినప్పటికీ ఆమె సీరియస్ గా తీసుకోదు.



‘మహానటి’ మూవీతో జాతీయ స్థాయిలో ఉత్తమనటి అవార్డు అందుకున్న తరువాత ఆమెకు ఎన్నో సినిమాలలో గ్లామర్ పాత్రలు వచ్చినప్పటికీ వాటిని ఒప్పుకోకుండా ఎక్కువగా హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలను మాత్రమే చేస్తోంది. ఈమె లేటెస్ట్ గా మళయాళంలో నటించిన ‘చిన్ని’ మూవీ తెలుగులో కూడ డబ్ చేయబడింది. మే 6న అమెజాన్ ప్రైం లో స్ట్రీమ్ కాబోతున్న ఈ మూవీని ప్రమోట్ చేస్తూ ఆమె అనేక మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తోంది.


డీ గ్లామర్ పాత్రలను చేసే విషయంలో ఏమాత్రం ఆలోచన లేకుండా నటించే ఈమె ఈ మూవీలో ఒక కిల్లర్ గా కనిపించబోతోంది. ఈ సినిమా విడుదల సందర్భంగా ఆమె గ్లామర్ ఎక్స్ పోజింగ్ పై కొన్ని కామెంట్స్ చేసింది. గ్లామర్ పాత్రలు తన మొదటి ప్రాధాన్యత కానేకాదు అంటూ సినిమాల విషయంలో నటిగా కొన్ని హద్దులు ఉన్నాయని ఆ హద్దులు దాటి తాను నటించను అని అంటోంది.


అయితే సర్కారు వారి పాటలో’ ఈమె మహేష్ పక్కన గ్లామర్ క్వీన్ గా నటించబోతోంది. ఈ మూవీ విడుదల తరువాత ఈమెకు టాప్ హీరోల సినిమాలలో చాల అవకాశాలు వస్తాయని ఆమె ఆశిస్తోంది. అయితే కీర్తి సురేష్ నటించిన సినిమాలు అన్నీ వరస గా ఫ్లాప్ లు అవుతూ ఉండటంతో ఆ నెగిటివ్ సెంటిమెంట్ మహేష్ సినిమా పై పడుతుందా అన్న సందేహాలతో మహేష్ అభిమానులు బెదిరిపోతున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: