యాంకర్ సుమ.. ఈ పేరు చెప్పగానే బుల్లితెర ప్రేక్షకుల ముఖంలో నవ్వు వెల్లివిరుస్తోంది. ఎందుకంటే బుల్లితెరపై ఆ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకుంది సుమ. దశాబ్దాల నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో నెంబర్ వన్ యాంకర్గా కొనసాగుతోంది. కేవలం బుల్లితెరపై కార్యక్రమాలు చేయడమే కాదు అటు అన్ని సినిమా ఈవెంట్లకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది యాంకర్ సుమ. ఈ క్రమంలోనే ఎంతో బిజీ బిజీ గానే గడుపుతోంది. ఇక సుమ తన వాక్చాతుర్యంతో ప్రతి ఒక్కరిని మంత్రముగ్ధుల్ని చేస్తుంది అని చెప్పాలి. ఇక తన యాంకరింగ్ లో ఎలాంటి వల్గారిటీ లేకుండా అందరినీ ఆకర్షిస్తూ ఉంటుంది.



 ఇప్పటికే బుల్లితెర పై పలు కార్యక్రమాలలో సందడి చేస్తున్న యాంకర్ సుమ.. అటు సినిమా ఈవెంట్ లో కూడా  అదరగొడుతుంది. ఇలాంటి సమయంలోనే మొన్నటి వరకు పరిమితం అయిన యాంకర్ సుమ ఇప్పుడు వెండితెరపై కూడా అడుగుపెట్టింది అన్న విషయం తెలిసిందే. ఎన్నో రోజుల నుంచి అభిమానులు సుమా వెండితెర మీదకు వస్తే ఎంత బాగుండు అని కోరుకుంటున్నారూ.  ఇక ఇటీవల అభిమానుల కోరిక తీరుస్తూ.. జయమ్మ పంచాయతీ అనే సినిమాతో మరోసారి వెండితెరపై అడుగుపెట్టింది.. ఇక ఈ సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అన్న విషయం తెలిసిందే.


 ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ప్రస్తుతం బిజీగా ఉంది యాంకర్ సుమ. కాగా బుల్లితెరపై ఏ కార్యక్రమంలో చూసినా సుమ దర్శనమిస్తూ ఉంది. ఇటీవల ఈటీవీ లో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి ఎంట్రీ ఇచ్చింది. ఈ సందర్భంగా ఆలీ అడిగిన పలు ప్రశ్నలకు తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన పలు విషయాలను కూడా అభిమానులతో పంచుకున్నారు. ఇకపోతే ఇక తాను నటించిన జయమ్మ పంచాయతీ సినిమాలో  మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి తనతో కూడా ఒక పాట పాడేలా చేశాడు అంటూ అభిమానులకు తెలియని సరికొత్త విషయాన్ని చెప్పింది. అంతే కాదు ఆ పాటని పాడి కూడా వినిపించింది..

మరింత సమాచారం తెలుసుకోండి: