ఇప్పటికే బుల్లితెర పై పలు కార్యక్రమాలలో సందడి చేస్తున్న యాంకర్ సుమ.. అటు సినిమా ఈవెంట్ లో కూడా అదరగొడుతుంది. ఇలాంటి సమయంలోనే మొన్నటి వరకు పరిమితం అయిన యాంకర్ సుమ ఇప్పుడు వెండితెరపై కూడా అడుగుపెట్టింది అన్న విషయం తెలిసిందే. ఎన్నో రోజుల నుంచి అభిమానులు సుమా వెండితెర మీదకు వస్తే ఎంత బాగుండు అని కోరుకుంటున్నారూ. ఇక ఇటీవల అభిమానుల కోరిక తీరుస్తూ.. జయమ్మ పంచాయతీ అనే సినిమాతో మరోసారి వెండితెరపై అడుగుపెట్టింది.. ఇక ఈ సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అన్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ప్రస్తుతం బిజీగా ఉంది యాంకర్ సుమ. కాగా బుల్లితెరపై ఏ కార్యక్రమంలో చూసినా సుమ దర్శనమిస్తూ ఉంది. ఇటీవల ఈటీవీ లో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి ఎంట్రీ ఇచ్చింది. ఈ సందర్భంగా ఆలీ అడిగిన పలు ప్రశ్నలకు తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన పలు విషయాలను కూడా అభిమానులతో పంచుకున్నారు. ఇకపోతే ఇక తాను నటించిన జయమ్మ పంచాయతీ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి తనతో కూడా ఒక పాట పాడేలా చేశాడు అంటూ అభిమానులకు తెలియని సరికొత్త విషయాన్ని చెప్పింది. అంతే కాదు ఆ పాటని పాడి కూడా వినిపించింది..