మెగాస్టార్
చిరంజీవి నుంచి
సినిమా విడుదలయ్యి దాదాపు రెండేళ్లు దాటుతుంది.
సైరా సినిమా ప్రేక్షకులను భారీ స్థాయిలో అలరించింది. అయితే ఆ తర్వాత
సినిమా ను త్వరగా విడుదల చేయలేక పోయాడు చిరు. దాంతో ఆయన అభిమానులు ఎప్పుడెప్పుడు
చిరంజీవి సినిమా థియేటర్లలో చూద్దామా అన్నట్లుగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అభిమానుల కోరికకు తగ్గట్లుగా చిరు బ్యాక్ టు బ్యాక్ సర్ప్రైజ్ లు రెడీ చేస్తున్నారు. ఇప్పటికే ఆచార్య
సినిమా విడుదలకు సిద్ధం చేసిన
చిరంజీవి మరో రెండు సినిమాలను అతి తక్కువ సమయంలోనే విడుదల చేయడానికి ప్లాన్ చేశాడు.
ఈ వయసులో కూడా చిరు ఇంతటి స్థాయిలో వేగంగా సినిమాలు చేయడం పట్ల అందరూ ఎంతో ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఏప్రిల్ 29వ తేదీన ఆచార్య సినిమాను విడుదల చేస్తున్నాడు చిరంజీవి.
కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో
రామ్ చరణ్ కీలక పాత్రలో నటించగా వీరిద్దరూ కలిసి పూర్తి స్థాయిలో నటిస్తున్న తొలి
సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా చిత్ర యూనిట్ తో పాటు
హీరో చిరంజీవి మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.
ఈ ఇంటర్వ్యూ ల లో భాగంగా తన కొత్త సినిమాల గురించి పలు ఆసక్తికరమైన విషయాలను ప్రేక్షకుల తో పంచుకుంటున్నారు చిరు. ఇప్పటికే మూడు క్రేజీ ప్రాజెక్టులలో నటిస్తూ బిజీగా ఉన్న చిరు తాను మరిన్ని చేస్తున్నా అని చెబుతున్నారు. అలా ఇప్పుడు చేస్తున్న సినిమాలు కాకుండా ఐదు సినిమాలను ఆయన ఓకే చేయబోతున్నానని ప్రకటించడం అందరినీ షాక్ కి గురి చేస్తోంది. ఆచార్య తర్వాత మూడు చిత్రాల్లో నటిస్తున్నాడు చిరు.
గాడ్ ఫాదర్, భోళా
శంకర్ అలాగే వాల్తేరు వీరయ్య ఈ మూడు సినిమాలు కూడా చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఇంకా
యువ దర్శకుడు
వెంకీ కుడుముల దర్శకత్వంలో కూడా ఓ
సినిమా చేయనున్నాడు. ఆ తరువాత ఎవరితో ఆయన సినిమాలు చేస్తాడో చూడాలి. ఎక్కువ మంది
యువ దర్శకులకు ఆయన
సినిమా అవకాశాలు ఇవ్వడానికి ఆసక్తిగా ఉన్న నేపథ్యంలో మరి చిరంజీవితో
సినిమా చేయబోయే అదృష్టాన్ని ఏ
యువ దర్శకులు అందుకున్నారో చూడాలి.