మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాను విడుదల చేస్తున్న చిరంజీవి తన తదుపరి సినిమాల విడుదల పై కూడా ఎంతో హుషారుగా ఉన్నాడు. చాలా రోజుల తర్వాత విడుదల కాబోతున్న సినిమా కావడంతో ప్రేక్షకుల అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఆమెకు జోడీగా రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి భారీ అంచనాల నడుమ ఈ సినిమాను విడుదల చేస్తూ ఉండగా ఆయన నటిస్తున్న తదుపరి సినిమాలు ఇప్పుడు ప్రేక్షకులను అలరించే విధంగా రూపుదిద్దుకోవడం మెగా అభిమానులను ఎంతగానో సంతోషపడుతుంది.

ఇప్పటికే ఆయన గాడ్ ఫాదర్ సినిమా ను పూర్తి చేశాడు. భోళా శంకర్ సినిమా కూడా చివరి దశలో ఉంది. ఇంకా బాబీ దర్శకత్వంలోని వాల్తేరు వీరన్న సినిమాను కూడా మొదలు పెట్టబోతున్నాడు.  ఆ విధంగా బ్యాక్ టు బ్యాక్ చిత్రాల చిత్రీకరణ దశలో ఉన్న ఈ హీరో తప్పకుండా మంచిగా ప్రేక్షకులను అలరించడం ఖాయం అని అంటున్నారు.ఇకపోతే చిరంజీవి మరొక దర్శకుడు తో కూడా సినిమా ఓకే చేసుకోవడం జరిగింది. ఆయనే వెంకీ కుడుముల.. ఛలో, భీష్మ వంటి చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు సొంతం చేసుకున్న ఈ దర్శకుడి కథకు మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఆ సినిమా లేనట్లుగా కనిపిస్తుంది. 

తాజాగా ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక సమయంలో దీని గురించి స్పష్టత వచ్చింది. ఈ ఈవెంట్ లో చిరు సినిమాలు చేస్తున్న డైరెక్టర్లు అందరూ కనిపించారు కానీ వెంకీ కుడుముల మాత్రం కనిపించలేదు. దాంతో ఆయన చిరు తో సినిమా చేయడం లేదని కొంతమంది భావిస్తున్నారు. స్టేజి మీద నిర్మాత దానయ్య కూడా మాట్లాడాడు కానీ అయన కూడా  వెంకీ కుడుముల తో సినిమా గురించి  మాట్లాడలేదు దీంతో ఈ సినిమా లేదనే భావన వ్యక్తపరుస్తున్నారు కొంతమంది. ఏదేమైనా మెగాస్టార్ ఈ సినిమాను వదులుకున్నాడా అని అభిమానులు చెబుతున్నారు. మరి దీనిలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు. తొందరలోనే దీనిపై సమాధానం వచ్చే అవకాశం వుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: