మెగాస్టార్ చిరంజీవి గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి తన సినిమా కెరియర్ లో ఎన్నో హిట్,  సూపర్ హిట్,  బ్లాక్ బస్టర్ సినిమాలతో సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు.   అలా సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలపై దృష్టి పెట్టి కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. మళ్ళీ మెగాస్టార్ చిరంజీవి 'ఖైదీ నెంబర్ 150' మూవీ తో తిరిగి సినిమా లోకి ఎంట్రీ ఇచ్చాడు.  

ఖైదీ నెంబర్ 150 తర్వాత మెగాస్టార్ చిరంజీవి 'సైరా నరసింహారెడ్డి'  సినిమాలో నటించి మెప్పించాడు.  మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస పెట్టి సినిమాల్లో నటిస్తున్న విషయం మన అందరికి తెలిసిందే.  అందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య మూవీ ఈ నెల 29 వ తేదీన విడుదల కాబోతుంది. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించాడు.  ఈ సినిమాతో పాటు ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.  అలాగే మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న  భోళా శంకర్ సినిమాలో చిరంజీవి నటిస్తున్నాడు.  ఈ సినిమాలతో పాటు బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న  సినిమాలో కూడా చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్నాడు.  

ఈ సినిమాలతో పాటు వెంకీ కుడుముల దర్శకత్వంలో కూడా చిరంజీవి ఒక సినిమాలో నటించడానికి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.  ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా జరిగిపోయింది.  ఈ సినిమాకు డివివి దానయ్య నిర్మాతగా వ్యవహరించనున్న విషయం కూడా మనకు తెలిసిందే.  కాకపోతే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ లు బయటకు రాకపోవడంతో ఈ సినిమా ఆగిపోయింది అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: