దర్శకుడు మణిరత్నం ఏదైనా సినిమా చేస్తున్నాడు అంటే చాలు అందులో సినిమా భారీగానే ఉండడంతో పాటు అసాధారణ కథ ఉండబోతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ మధ్య కాలంలో ఆయన తెరకెక్కించిన చిత్రాలు ఏవి బాక్సాఫీస్ దగ్గర అంతగా ఆకట్టుకోలేదు. అయితే ఇదివరకు నవాబ్ లాంటి మల్టీస్టారర్ మూవీని తెరకెక్కించిన అది కొంత మందిని మాత్రమే ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు తాజాగా హిస్టారికల్ కాన్సెప్టుతో మనసుతో చేసేందుకు ఒక ప్లాన్ చేస్తున్నాడు మణిరత్నంమణిరత్నం నాలుగేళ్లుగా దృష్టి సాధించి కేవలం ఒక్క సినిమానే తెరకెక్కించడం మొదలుపెట్టాడు. ఆ చిత్రమే పొన్నియిన్ సెల్వన్.. కరోనా వల్ల ఈ చిత్రం షూటింగ్ కాస్త ఆలస్యం అయిందని చెప్పవచ్చు. ఇక ఈ మధ్య కాలంలోనే సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.. బాహుబలి సినిమా తరహాలోనే ఈ చిత్రాన్ని కూడా రెండు భాగాలు రూపొందిస్తున్నారు మణిరత్నం. ఈ భారీ యాక్షన్ అసాధారణమైన పాత్రలు, ఎమోషన్స్, గ్రాఫిక్స్ విజువల్ ఆధారంగా ఈ సినిమాని డైరెక్టర్ తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. పొన్నియిన్ సెల్వన్ రెండు భాగాల పోస్ట్ థియేట్రికల్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ చేజిక్కించుకున్న సమాచారం అందుతోంది.


ఈ భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన పిరియాడిక్ చిత్రంలో కార్తీ, విక్రమ్, జయం రవి వంటి తదితర తమిళ స్టార్ లో నటించడం జరుగుతోంది. ఇక ఇందులో మాజీ విశ్వసుందరి అయిన ఐశ్వర్య రాయి కూడా ఈ చిత్రంలో ఒక నెగెటివ్ పాత్రలో నటిస్తోందట. మరి ఈ తమిళ చిత్రం తమిళంలో అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కించిన సినిమాలలో ఇది కూడా ఒకటి. ఈ చిత్రాన్ని అన్ని భాషల్లో ఒకేసారి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు డైరెక్టర్ మణిరత్నం. మరి ఈ ప్లాన్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: