లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న సినిమా 'పొన్నియిన్ సెల్వన్‌'. కల్కి కృష్ణమూర్తి రాసిన నవలను ఆధారంగా చేసుకుని ఈ సినిమాని రూపొందిస్తున్నారు.మద్రాస్ టాకీస్తో కలిసి లైకా ప్రొడక్షన్స్ అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్‌ డ్రామా సినిమాను రెండు భాగాలుగా నిర్మిస్తోంది.అయితే, ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉన్న  మొదటి భాగం విడుదల తేదీని ప్రకటించింది సినిమా బృందం. ఈ సంవత్సరం సెప్టెంబర్ 30న 'పొన్నియన్ సెల్వన్' పార్ట్ 1ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించింది. తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరో అప్ డేట్ ని కూడా ఇచ్చారు ఈ మూవీ మేకర్స్.ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి ఆరు నెలలు సమయం ఉండగా.. సెకండ్ పార్ట్‌తో కలిపి ఈ సినిమా ఓటీటీ డీల్ కుదిరిందని సమాచారం తెలుస్తోంది. ఈ సినిమా పోస్ట్ థియేట్రికల్ స్ట్రీమింగ్ హక్కులని ప్రముఖ ఓటీటీ కంపెనీ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది.


అమెజాన్ ప్రైమ్ అన్ని భాషాల్లో కలిపి ఈ సినిమాకి 125 కోట్లకి కొనుగోలు చేసినట్టుగా సమాచారం తెలుస్తుంది. తమిళంలో ఇదే బిగ్గెస్ట్ డిజిటల్ డీల్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు.ఇక, ఈ సినిమా పూర్తిగా మణిరత్నం కలల ప్రాజెక్టు. దాదాపు 20 ఏళ్ల ముందే ఆయనకు ఈ సినిమా తీయాలన్న ఆలోచన వచ్చింది. కల్కి కృష్ణమూర్తి అనే రచయిత 'పొన్నియన్ సెల్వన్' పేరుతోనే రాసిన ఓ కల్ట్ నావెల్ ఆధారంగా మణిరత్నం ఈ సినిమాని రూపొందించారు. ఇక కాస్టింగ్ పరంగా కూడా ఇండియాలోనే ఇదే బిగ్గెస్ట్ ఫిలిం అని చెప్పొచ్చు. ఈ సినిమాలో విక్రమ్, ఐశ్వర్యారాయ్, కార్తీ, త్రిష, జయం రవి, శరత్ కుమార్‌, ప్రకాష్ రాజ్, పార్తీబన్, ప్రభు, విక్రమ్ ప్రభు ఇంకా అలాగే శోభిత దూళిపాళ్ల.. ఇలా ఈ సినిమాలో భారీ తారాగణమే ఉన్నారు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితాన్నందుకుంటుందో అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: