హీరో విశ్వక్ సేన్ నటిస్తున్న తాజా చిత్రం అశోకవనంలో అర్జున కళ్యాణం. ఈ సినిమా డైరెక్టర్ విద్యాసాగర్ సరికొత్త దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. రుక్సార్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తున్నది. ఈ చిత్రాన్ని బివిఎస్ ప్రసాద్ సమర్పణలో నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా స్టోరీ ఆంధ్ర అమ్మాయి తెలంగాణ అబ్బాయి నేపథ్యంలో సాగే కథ తెరకెక్కించడం జరుగుతోంది. ఇందులో హీరో విశ్వక్సేన్ ఒక విభిన్నమైన పాత్రలో నటించబోతున్నారు. ఇక అదే విధంగా తన నటనతోనే నవ్వులు పుయించా బోతున్నారని చిత్రబృందం తెలియజేసింది.

తాజాగా ఈ సినిమా మూడు సార్లు విడుదల తేదీ నుంచి వాయిదా పడుతూ వస్తోంది అయితే ఈనెల 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రం రాబోతోంది.. ఇక ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను కూడా విడుదల చేశారు. ట్రైలర్లో తెలంగాణ ఫ్యామిలీ ఆంధ్ర ఫ్యామిలీ మధ్య జరిగే కొన్ని సన్నివేశాలు హైలెట్గా నిలిచిన కనిపిస్తున్నాయి. ఇక సినిమా విడుదల తేది దగ్గర పడుతున్న కొద్దీ చిత్రబృందం కూడా ప్రమోషన్ పనులను చాలా వేగంగా చేస్తున్నారు. అందులో భాగంగానే శనివారం మీడియాతో హీరోయిన్ రుక్సార్ మాట్లాడడం జరిగింది వాటి గురించి చూద్దాం.

ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానం తెలియజేసింది రుక్సార్. అంతేకాకుండా పెళ్లి పై తనకున్న ప్రత్యేకమైన ప్లాన్ ను కూడా తెలియజేసింది. ఆకతాయి సినిమా ద్వారా మొదటిసారిగా తెలుగు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిందట. ఈ సందర్భంగా తనను వివాహం చేసుకోబోయే భర్త గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు. కుటుంబంలోని వారంతా ప్రేమించే వివాహం చేసుకున్నారు. తనని పెళ్ళి చేసుకోబోయే వాడు ఎలా ఉండాలో కూడా స్పష్టం చేసింది. వ్యక్తి ఎలా ఉన్నాడు అనేది ముఖ్యం కాదు తనని తన ఫ్యామిలీని గౌరవించే వాడు అయితే చాలు అని తెలియజేస్తుంది. టాలీవుడ్ లో డైరెక్టర్ సుకుమార్ తో కలసి సినిమాలో పని చేయాలని ఉందని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: