కన్నడ హీరో యష్ నటించిన కేజీఎఫ్ -2 చిత్రంతో దేశవ్యాప్తంగా ఈ చిత్రం పేరు ప్రఖ్యాతులు సాధించింది. ఇక ఏప్రిల్ 14న ఐదు భాషల్లో విడుదలై పలు రికార్డులను సైతం తిరగరాసి సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. దాదాపుగా నాలుగు సంవత్సరాల క్రితం వచ్చిన మొదటి పార్ట్ kgf-1 తో ఈ సినిమా రికార్డు సైతం మొదలుపెట్టింది. దీంతో చాప్టర్-2 ప్రేక్షకులు దేశవ్యాప్తంగా బ్రహ్మరథం పట్టారు. ఈ చిత్రం విడుదలైన ప్రతి చోట కూడా కొన్ని సంచలను సృష్టించింది.

ఇక ఇందులో నటించిన ప్రతి ఒక్కరు కూడా పాన్ ఇండియా స్టార్లుగా మారిపోయారు. ఇక డైరెక్టర్ని అయితే ప్రతి ఒక్కరు కూడా ప్రశంసించడం జరుగుతోంది. ప్రస్తుతం ఈ సినిమా 1000 కోట్ల క్లబ్బులో చేరినట్లుగా సమాచారం. ఈ చిత్రాన్ని తెరకెక్కించడం వెనక డైరెక్టర్ ప్రశాంత్ నీల్ నమ్మకం , శ్రమ ఉందని చెప్పవచ్చు. అంతకంటే ఎక్కువగా అతనిని ఎంతోమంది తిరస్కరించారన్న కసి కూడా తన దగ్గర ఉన్నదట. అయితే డైరెక్టర్ గా ప్రయత్నిస్తున్నప్పుడు కొన్ని యాక్షన్ కథలతో కొంతమందిని కలవగా ప్రతి ఒక్కరు కూడా రొటీన్ కదా కావడంతో వెళ్ళిన ప్రతిచోటా అతనికి అవమానమే జరిగిందట.


అలా కసిగా ప్రశాంత్ నీల్ తన భావ శ్రీమురళినే హీరోగా పెట్టి. తన మొదటి సినిమాని తెరకెక్కించారు ఆ చిత్రమే ఉగ్రం. ఈ సినిమా మంచి విజయం కావడంతో ఆ తర్వాతే కే జి ఎఫ్ సినిమా ని మొదలు పెట్టాడు ప్రశాంత్ నీల్. డైరెక్టర్ విజన్ ని నమ్మి హోమ్ బలే ఫిలిమ్స్ అధినేత విజయ్ కిరగందూర్ ఈ దర్శకుడికి అవకాశం ఇచ్చారు. ఇక యష్ కూడ అంతంత మాత్రమే ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాడు. ఇక ఈ ముగ్గురి కలయికలో ఒక అద్భుతం జరగడం తో కన్నడ సినీ పరిశ్రమలోని కేజీఎఫ్ సినిమా 100 కోట్లు సాధించి తిరుగులేని రికార్డులను కొల్లగొట్టింది. ఇక కే జి ఎఫ్-2 తో అంతకుమించి అనేలా కలెక్షన్లను రాబడుతోంది. ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్. ఇక ఈ చిత్రం అయిపోయిన వెంటనే ఏంటి అర్థం ఒక సినిమాని చేయబోతున్నారు అందుకు 50 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అడిగినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: